Rajamouli And Mahesh Babu
Rajamouli And Mahesh Babu: సినీ ఇండస్ట్రీ ఈ మధ్య ఏదో ఒక వివాదంతో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. లేలేస్ట్ గా రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతోంది. నిన్నటి వరకు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత తనను ఎప్పుడో విడిచిపెట్టిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. అయితే ఇప్పుడు లావణ్య తరుపున లాయర్ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్యకు రూ. 70 లక్షలు మోసం చేశారని ఆరోపించారు. ఇంకా ఏం చెప్పారంటే?
రాజ్ తరుణ్, లావణ్య విషయంలో తవ్వే కొద్ది విషయాలు బయటకు వస్తున్నాయి. రాజ్ తరుణ్ తో ఎప్పటి నుంచో తాను రిలేషన్ షిప్ లో ఉంటున్నానని, ఈ విషయం సినిమా పరిశ్రమ మొత్తం తెలుసునని అన్నారు. అయితే తాను ఎవరితో రాజ్ తరుణ్ గురించి ఎక్కువగా చెప్పలేదని, అలా చెప్పి ఉంటే ఎవరో ఒకరు వచ్చి తన కోసం మాట్లాడేవారని అన్నారు. తాను ఒక గుడిలో పెళ్లి చేసుకున్నామని, అప్పడు రిజిస్ట్రర్ చేసుకోలేదన్నారు. అయితే ఇప్పుడు బాధపడాల్సి వస్తుందని అన్నారు.
రాజ్ తరుణ్ ఫారిన్ వెళ్లినప్పుడు తనతో దూరమయ్యాడని, అప్పుడు మాల్వి శర్మ అనే నటితో పరిచయం అయిందన్నారు. అప్పటి నుంచి తనతో రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నాడని పేర్కొంది. . ఎన్నోసార్లు రాజ్ తరుణ్ ను వదిలేయమని మాల్వి శర్మ ను ఎన్నోసార్లు వేడుకున్నానని, అయితే తనను బెదిరించేదని లావణ్య ఆరోపించారు. అంతేకాకుండా లావణ్య దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజ్ తరున్ రూ.70 లక్షల వరకు నగదు తీసుకున్నాడని ఆమె తరుపున న్యాయవాది పేర్కొన్నారు