Poonam Kaur: పూనమ్ కౌర్ గురించి ఇప్పుడు కొంత మందికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే, ఈ మధ్య సినిమాలకు కొంత దూరమైంది. ఇటీవల ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించడంపై కామెంట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఆయన మోసం చేసి గెలిచారంటూ ట్వీట్ చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో పూనమ్ బిజీగా ఉండేది. కానీ ఆమెకు రాను రాను అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతలా అంటే ఒక్క సినిమా కూడా ఆమె చేతిలో లేదు. కానీ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండాలి కాబట్టి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంది.
ఇక కొన్ని నెలలుగా ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తుంటుంది. ఆమె తాజాగా షేర్ చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఆ పోస్ట్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ను ఉద్దేశించి పెట్టినవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పోస్టులో ఏముందంటే ‘మోసం చేసి చీటర్గా గెలవడం కంటే నిజాయితీ, విలువలు ఉన్న యోధుడిగా ఓడిపోవడం మేలు’ అంటూ తన ఎక్స్ (ట్వీట్టర్)లో ట్వీట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించే మరోసారి ప్రస్తావిస్తూ పూనమ్ ట్వీట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జగన్ నిజాయితీగా పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ చీటింగ్ చేసి గెలిచారంటూ.. వైసీపీ కార్యకర్తలు ఆమె చేసిన ట్వీట్కు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఏపీ రాజకీయాల కోసం కాదని.. కేంద్రంలో బీజేపీ గెలుపుపై పూనమ్ సెటైర్ వేసిందంటూ కొందరు అంటున్నారు. మరి పూనమ్ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ పెట్టిందో తెలీదు కానీ ఎవరికి నచ్చినట్లు వాళ్లు తీసుకొని కామెంట్లు పెడతున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More