Mahesh Babu: దర్శక ధీరుడైన రాజమౌళి ఇప్పటి వరకు ఇండియా లో భారీ సక్సెస్ లను అందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో బాగం గానే మహేష్ బాబు సినిమా విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశ్యంతో అన్ని విషయాలను తనే దగ్గర ఉండి మరి ఆ వర్క్ చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక హాలీవుడ్ వాళ్ళు అయితే ఈ సినిమా చూసి ఇండియన్ సినిమాని ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్లకు పోటీ ఇచ్చే దర్శకుడు ఒకడున్నాడు అని అనుకునే విధంగా ఈ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మొదట ఈ సినిమా కోసం 800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత వెయ్యి కోట్ల వరకు పెరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా బడ్జెట్ ను పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం మరోసారి దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ ను పెంచి 1200 కోట్ల బడ్జెట్ ను ఈ సినిమా కోసం కేటాయించబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక తను ఇంతకుముందు చేసిన త్రిబుల్ ఆర్ సినిమా కోసం దాదాపు 600 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. ఇక ఇప్పుడు దానికి డబుల్ బడ్జెట్ పెడుతున్నారు. కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రాజమౌళి ఏది చేసినా చాలా గ్రాండియర్ గా చేస్తాడు. కాబట్టి ఈ సినిమాను కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఈ సినిమాతో హాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్లందరికీ గట్టి పోటీని ఇస్తాడు అనేది మాత్రం వాస్తవం…
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అన్ని వందల కోట్లు పెడితే కలెక్షన్స్ భారీగానే వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అనే దానిమీద ఇప్పటివరకు సరైన నిర్ణయాన్ని తెలియజేయకపోవడంతో మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు తీవ్రమైన నిరాశకు గురి అవుతున్నారు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More