Kangana Ranaut
Kangana Ranaut: ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌట్. ఆ తరువాత పెద్దగా తెలుగు సినిమాలలో కనిపించకపోయినా హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అమ్మడు. ఇక ఈమధ్యనే జయలలిత బయోపిక్ తలైవి సినిమాతో మరోసారి సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి 2 సినిమా అలానే ఎమర్జెన్సీ సినిమాలతో బిజీగా ఉండి కంగనా.
కంగనా సినిమాలతో కాకుండా ఎక్కువ వివాదాలతో కూడా వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూ ఉంటుంది అనే సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా తన ఇంస్టాగ్రామ్ పోస్టులు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది పేరు పెట్టకుండా తాను చెప్పాల్సింది అంతా చెప్పేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో జరుగుతున్న ఎన్నో విషయాలను కొంచెం కూడా భయం లేకుండా మీడియా ముందు పెట్టిన వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక స్టార్ హీరో గురించి కంగనా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో గురించి చెబుతూ.. ‘సూపర్ స్టార్, స్త్రీ లోలుడిగా తెలిసిన వ్యక్తి.. నా ఇంటికి వచ్చేవాడు. డేట్ చేయమంటూ ఆదుకునేవాడు. ప్రాధేయపడేవాడు. రహస్యంగా నన్ను వెంబడించేవాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ అని అడిగితే.. డాడీ లిటిల్ ప్రిన్సెస్ ని తాను లవ్ చేయడం లేదని అన్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ లిటిల్ ప్రిన్సెస్ తో కలిసి జీవించడం ఇష్టం లేదని.. ఈ విషయం ఆమెకు చెప్పలేనని.. నువ్వు ఒప్పుకుంటే సీక్రెట్ గా కలిసి జీవిద్దం’ అని ఆ సూపర్ స్టార్ చెప్పినట్లు ఆమె రాసుకొచ్చింది. అయితే ఈ మాటలు అన్నీ విన్నవారు ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు రణబీర్ కపూర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
రణబీర్ పెళ్లి ఒక నాటకమని ఆమె గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రణబీర్ ని ఉద్దేశించే పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ పోస్టులో ఉన్న లిటిల్ ప్రిన్సెస్ రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ అని కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా యూజర్స్.
ఇక అక్కడితో ఆగకుండా మరికొన్ని విషయాలు షేర్ చేస్తూ కంగనా.. ‘ఎన్ని సార్లు నంబర్ బ్లాక్ చేసినా వేరే నంబర్ల నుంచి కాల్ చేసేవాడని.. ఆ తర్వాత నా ఫోన్లు హ్యాక్ అయ్యాయని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. తన పెళ్లే ఒక అబద్ధమని చెప్పాడని.. ఆ పుట్టిన బేబీ కూడా మూవీ ప్రమోషన్ కోసం ఆడిన నాటకం అని అన్నట్టు ఆమె వెల్లడించింది. ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఎవరైనా సరే నైతికంగా తప్పుడు పనులకు పాల్పడతారో వారు మనుషులు కాదు, రాక్షసులు. అందుకే వారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. అధర్మాన్ని నాశనం చేయడమే ధర్మం యొక్క అసలైన ఉద్దేశం. అదే గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ‘ అని తన ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది.
ఇక ఈ స్టేటస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపైన రణబీర్ కి అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: That star hero wanted me despite his wife kangana ranaut
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com