Samantha Naga Chaitanya
Samantha Naga Chaitanya: ఏమాయ చేశావే సినిమాలో కలిసి నటించి ఆ తర్వాత స్నేహితులుగా, తర్వాత ప్రేమికులుగా, ఆ తర్వాత భార్యభర్తలుగా జర్నీ కొనసాగించారు సమంత నాగచైతన్య. కానీ చివరకు ఏమైందో అనివార్య కారణాల వల్ల ఇద్దరు విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే విడిపోయిన దగ్గర నుంచి ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఈ విడిపోయిన దంపతులు. కానీ అభిమానులు మాత్రం ఈ జంట కలవాలని ఇప్పటికి కోరుకుంటూనే ఉన్నారు. అందరూ కోరుకున్నట్టుగానే మళ్లీ కలవబోతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. ఎందుకు ఎలా అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..
ఏది జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ అవుతుంటుంది. సోషల్ మీడియాలో చేసే పోస్టుల వల్ల ఎవరికి తోచింది వారు చెప్పేస్తుంటారు. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్లో నాగ చైతన్య పోస్ట్ చేసిన ఓఫొటో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు హాష్ అనే పెంపుడు కుక్కను పెంచుకున్న విషయం తెలిసిందే. ఈ కుక్కతో ఎన్నో సార్లు వారు కనిపించడమే కాదు ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు అదే కుక్క ఫోటో వల్ల వీరు కలిశారా అనే ప్రశ్న మొదలైందట.
వీరిద్దరు విడిపోయిన తర్వాత నుంచి హాష్ సమంతతో ఉంది. గతంలో కొన్నిసార్లు సామ్ ఈ కుక్క ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కుక్కపిల్ల నాగచైతన్యతో కనిపించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగచైతన్య కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్కపిల్ల చైతన్య వద్దకు వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా మరోసారి అదే కుక్క పిల్ల ఫొటోను చైతన్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. కారులో తీసిన ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన చై, సామ్ ఫ్యాన్స్ ఈ జంట కలిసిపోయిందంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. అయితే దీనిపై మాత్రం చై కానీ సామ్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.
అయితే తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ మరో చర్చకు దారి తీసింది. సమంత తన ఇన్స్టా స్టోరీలో ‘దయాగుణాన్ని వ్యూహంగా కాకుండా.. జీవిత మార్గంగా అలవరుచుకునే వారికి హ్యాట్సాఫ్’ అనే కొటేషన్ రాసున్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో సమంత చేసిన పోస్ట్ వెనకాల అసలు కారణం ఏంటి.? చైతన్య, సమంత మళ్లీ కలిసిపోనున్నారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఇలాంటి పోస్ట్ చేసిందా.? అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా అటు చై, ఇటు సామ్ చేస్తున్న ఈ పోస్టులు నెటిజన్లను కన్ఫ్యూజ్కు గురి చేస్తాయని చెప్పాలి.
మొత్తం మీద ఓ క్లారిటీ ఇవ్వకుండా చై, సామ్ ఇద్దరు కూడా వారికి తోచిన పోస్టులు, ట్వీట్లు చేస్తూ అభిమానులను తికమక పెడుతున్నారు. దీంతో అక్కినేని అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారట. మరి చూడాలి దీనిపై ఓ క్లారిటీ ఇచ్చి కలుస్తున్నారా? లేదా అనే విషయానికి పులిస్టాప్ పెడుతారో లేదో…
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Samantha and naga chaitanya who are going to meet again has clarity come with these posts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com