Puri Jagannadh: సినిమా పరిశ్రమలో పూరి అంటే వెంటనే గుర్తుకొచ్చే దర్శకుడు పూరి జగన్నాథ్. ఇడియట్, పోకిరి, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ దర్శకుడు తన కొడుక్కి సూపర్ హిట్ ఇవ్వలేక పోతున్నాడు. చాలా మంది హీరోస్ కి మార్కెట్ పడిపోతున్న సమయంలో వాళ్లకు సూపర్ హిట్ లాంటి సినిమాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ మార్కెట్ పెంచాడు. ఆంధ్రా పోరిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆకాశ్ పూరి.
ఆంధ్రాపోరిగా సినిమా తీశారా అని కొంతమంది ప్రేక్షకులకే తెలియదు. ఇక్కడే పూరి జగన్నాథ్ విఫలమయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మొదటిసారిగా సినిమా పరిశ్రమకు కొడుకుని పరిచయం చేస్తున్నప్పుడు కథ మంచిది ఉండాలి లేదా ఫాంలో ఉన్న హీరోయిన్ అయినా తీసుకోవాలి. మెహబూబా అంటూ ఆకాశ్ రెండో చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం నుండి కూడా ఆకాష్ కి ఆడియన్స్ లో అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. తన తర్వాత సినిమాల కైనా పూరి జాగ్రత్త తీసుకుంటారో లేదో అనేది ఆసక్తికరంగా ఉంది.
ఆకాశ్ కొత్త చిత్రం రొమాంటిక్ ట్రైలర్ మంగళవారమే రిలీజైంది. మామూలుగా ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమ అనుకుని అట్రాక్షన్లో ఉంటారని.. కానీ వీళ్లు నిజమైన ప్రేమను అట్రాక్షన్ అనుకుంటున్నారు అని ఈ ట్రైలర్ లో చూపిస్తారు. పూరి శిష్యుడైన అనిల్ పాడూరి దర్శకుడుగా తెరకెక్కించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చింది పూరీనే.
కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా… ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అలానే దండుపాళ్యం మకరంద్ దేశ్పాండే, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం కాస్త రోగ్ సినిమాల అనిపిస్తోంది అక్టోబరు 29న ఈ సినిమా విడుదల కానుంది ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాలి.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More