Romantic: మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. లవ్స్టోరీ, గ్యాస్స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కేతిక శర్మ కూడా టాలీవుడ్లో అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అనిల్ పాదూడి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్ , ఛార్మి ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు రొమాంటిక్ సినిమాకు సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే విడుదలకు ముందు ఈ సినమాపై పూరి భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆకాశ్ తన నటనతో ఇరగదీశాడని.. పూరి తనయుడిగా తన మార్క్ను చూపించాడని అన్నారు. రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఎంతో బాగుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ప్రస్తతం ఓటీటీ రంగంలో దూసుకెళ్లిపోతున్న వాటిల్లో ఆహా ఒకటి. మిలియన్ల సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుని.. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అగ్రగామిగా నిలిచేందుకు పోటీ పడుతోంది. కాగా, రొమాంటిక్ సినిమాను ఆహాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అక్టోబరు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను.. ఓటీటీలో నవంబరు 29న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటనకూడా విడుదల చేసింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వారందా ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.