Homeఎంటర్టైన్మెంట్Renu Desai: దయచేసి దత్తత తీసుకోండి అంటున్న రేణు దేశాయ్..వైరల్ గా మారిన లేటెస్ట్ పోస్ట్!

Renu Desai: దయచేసి దత్తత తీసుకోండి అంటున్న రేణు దేశాయ్..వైరల్ గా మారిన లేటెస్ట్ పోస్ట్!

Renu Desai: పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి పూణే లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. విడాకులు తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన రేణు దేశాయ్, ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్, భవిష్యత్తులో కూడా నటనకి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు దొరికితే కచ్చితంగా చేస్తాను అంటుంది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో మన ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విడాకులు తీసుకున్న కొత్తల్లో ఈమె ట్విట్టర్ లో కూడా చాలా యాక్టీవ్ గా ఉండేది. కానీ అక్కడి నెగటివిటీ ని భరించలేక ట్విట్టర్ అకౌంట్ తొలగించింది. అప్పటి నుండి ఆమె కేవలం ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాలలో మాత్రమే యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది.

ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికీ ఈమె చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన జీవితం లో జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉండే రేణు దేశాయ్ కి సామజిక స్పృహ కూడా చాలా ఎక్కువ. ఎవరికైనా సహాయం కావాలని ఆమెని ట్యాగ్ చేసి పోస్ట్ వేస్తే, తన టీం తో విచారణ జరిపి వెంటనే సహాయం చేస్తుంది. గడిచిన పదేళ్లలో ఆమె ఎంతో మందికి సహాయం అందించింది. అంతే కాదు తన పిల్లలు అకిరా నందన్, ఆద్య లకు కూడా అలాంటివి అలవాటు చేసింది. అకిరా కరోనా సమయం లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్నో వందల ఆక్సిజెన్ సిలిండర్లు విరాళం గా అందించాడు. ఎంతో మందికి ఆహార పొట్లాలు కూడా పంచి పెట్టాడు. అలా రేణు దేశాయ్ తన లాగానే తన పిల్లల్ని కూడా తయారు చేసింది. ఈమెకు మూగ జీవాలు అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం.

కుక్కలను దత్తత తీసుకొని పెంచడమే కాకుండా, సోషల్ మీడియా లో ఏ కుక్కలకు అయినా వైద్యం అవసరమైనప్పుడు, ఆహరం అవసరమైనప్పుడు తన వంతుగా సహాయం చేయడమే కాకుండా, తనని అనుసరించే వాళ్ళతో కూడా సహాయం చేయిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈమె ఇంస్టాగ్రామ్ లో కొన్ని కుక్కల ఫోటోలను అప్లోడ్ చేసి, దయచేసి వీటిని ఎవరైనా దత్తత తీసుకోండి అంటూ పోస్ట్ అప్లోడ్ చేసింది. ఇది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. మూగ జీవాల మీద ఆమె చూపిస్తున్న ప్రేమ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అంతే కాదు మూగ జీవాలకు జరిగే అన్యాయాల మీద కూడా ఈమె తన గొంతు బలంగా వినిపిస్తుంది. రీసెంట్ గా ఇండియన్ 2 చిత్రం లో మూగ జీవాలను కించపరుస్తూ ఒక సన్నివేశం ఉంటే, ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యినందుకు ఆనందం గా ఉంటూ ఆమె వేసిన ఒక ట్వీట్ తెగ సెన్సేషనల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇలా తన మనసులో ఉన్న విషయాలను, భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తుంది రేణు దేశాయ్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular