Homeఎంటర్టైన్మెంట్ఘాటు సీన్స్ కి మరో ముదురు హీరోయిన్ సై !

ఘాటు సీన్స్ కి మరో ముదురు హీరోయిన్ సై !


బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో రెండేళ్లుగా సినిమా చేయడానికి నానాకష్టాలు పడి, తీరా సినిమాని సెట్ చేసుకుంటే.. కరోనా వచ్చి షూటింగ్స్ జరగకుండా కమ్మేసింది. అయినా మనోడు తగ్గేలా లేడు. ఎంతైనా వర్మ శిష్యుడు కదా.. ఆయనలానే ఓ బూతు బాగోతాన్ని వెబ్ ఫిల్మ్ లా మలిచి కుర్రోళ్ళ మీద వదలడానికి సన్నద్ధం అవుతున్నాడు. కాన్సెప్ట్ కూడా కసిగానే ఉంది, ఆంటీల మీద కుర్రోళ్లకు ఎందుకు అంత ఇంట్రస్ట్.. ఒకవేళ వాళ్లకు ఆవకాశం వస్తే ఎలాంటి తప్పులు చేస్తారు..? అలాగే తప్పటడుగులు వేసిన ఆంటీల పరిస్థితి ఏమిటి ? అనే కోణంలో ఈ బూతు వెబ్ ఫిల్మ్ సాగుతుందట.

Also Read: నాని ‘జెర్సీ’కి అరుదైన ఘనత…

అయితే ఈ వెబ్ సినిమాలో మెయిన్ లీడ్ గా ఒక్కప్పటి బబ్లీ బ్యూటీ రంభ నటించబోతుందట. అజ‌య్ ఇప్పటికే రంభకి కథ కూడా వివరించార‌ట. రంభ కూడా వెబ్ ఫిల్మ్ చేయడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఏమైనా కొంతమంది హీరోయిన్లకు వయసు పెరిగిన గ్లామర్ తగ్గదు. అలాంటి కోవకే చెందుతుంది రంభ. అయితే ఈ లెట్ వయసులో అందాల ఆరబోతలో హద్దులు దాటడం అంటే.. రంభ మళ్ళీ నిలబడటం కోసం కాస్త బోల్డ్ స్టెపే తీసుకుంది. ఇప్పటికే రమ్యకృష్ణ, టబు లాంటి ముదురు హీరోయిన్స్ ఘాటు సీన్స్ లో రెచ్చిపోతున్నారు.

Also Read: ‘పూజా హెగ్డే’ పై నాగ్ అసంతృప్తి !

ఈ ముదురు భామలంతా ఏ మాత్రం మొహమాట పడకుండా పాత్ర డిమాండ్ చేస్తే ఎప్పుడెప్పుడు ఎక్స్ పోజ్ చేద్దామా అన్నట్టు దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నిల్ ఇస్తుంటారు. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి క్రేజ్ పెరగడంతో ఆ డిజిటల్ పోటీని తట్టుకుని నిలబడటానికి మేకర్స్ కూడా, ఎక్కువుగా ఈ మాజీ బ్యూటీలనే రంగంలోకి దించుతున్నారు. వీళ్ళు కూడా తమ అందాలను ప్రదర్శించడంలో అసలు వెనకడుగు వేయకుండా.. కెరీర్ స్టార్ట్ అయి మూడు దశాబ్ధాలు పూర్తవుతున్నా ఇప్పటికీ అదే గ్రేస్ అదే ఫిజిక్ చూపిస్తూ.. నవతరం కుర్రాళ్ల పై తమ హాట్ నెస్ ను బాణంలా దించుతున్నారు. మొత్తానికి ఘాటు సీన్స్ కి మరో ముదురు హీరోయిన్ రంభ కూడా సై అనడం.. రంభ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే విషయమే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular