‘వారణాసి’ సినిమాతో తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలవడంతో 100% పర్సెంట్ సక్సెస్ రేటు కలిగి ఉన్న ఏకైక దర్శకుడిగా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు…అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న ‘వారణాసి’ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే నమ్మకంతో రాజమౌళి ఉన్నాడు. ఇక ఈ సినిమా కోసం ఆయన అహర్నిశలు విపరీతంగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ సైతం సరికొత్త టెక్నాలజీలో షూట్ చేయాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇతర దేశాల నుంచి కొంతమంది టెక్నీషియన్స్ ను తీసుకొచ్చి మరి ఈ సినిమాలో భాగం చేస్తున్నాడు. మహేష్ బాబుని సైతం ఇంతకుముందు ఎవ్వరు చూడనటువంటి ఒక డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడట.
ఇతను అనుకున్నట్టుగా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రీసెంట్ గా రాజమౌళి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఆయన జేమ్స్ కామెరూన్ ను కలిసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే వారణాసి సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడడానికి ప్రయత్నం చేస్తున్న రాజమౌళి దానికి సంబంధించిన వివరాలను జేమ్స్ కామెరూన్ దగ్గర్నుంచి తెలుసుకున్నారట.
ఆయన కూడా రాజమౌళికి రెస్పెక్ట్ ఇచ్చి టెక్నాలజీని ఎలా వాడాలి అనే విషయంలో రాజమౌళికి ఒక క్లారిటి ఇచ్చినట్టుగా తెలుస్తుంది… ఇక వారణాసి సినిమాకు సంబంధించిన టీజర్ ను సైతం జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలనే విధంగా రాజమౌళి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద ఒక భారీ బజ్ క్రియేట్ చేసి ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని మొదటి రోజే చూడాలి అనేలా క్యూరియాసిటిని రేకెత్తింపజేసేలా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ అయిపోగానే ప్రమోషన్స్ పనుల్లో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది…