Poonam Kaur
Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్స్ కి పెట్టింది. వివాదాలతో ఫేమస్ అయిన ఈ నటి తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతుంటారు. అవి ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంటాయి. అయితే ఆమె తన ట్వీట్స్ లో ఎవరి పేరు ప్రస్తావించరు. నర్మగర్భంగా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. పూనమ్ కౌర్ ట్వీట్స్ ని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొందరికి అన్వయిస్తారు. ఇది నిత్యకృత్యమైంది.
తాజాగా పూనమ్ మరో ట్వీట్ చేశారు. ‘ఈ మధ్య రాజకీయాలు వినోదానికి వేదిక అయ్యాయి.. అదే సమయంలో వినోదం మాత్రం సీరియస్ గా మారిపోయింది’ అని ట్వీట్ చేశారు. సినిమాల్లో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ రాజకీయాల్లో దొరుకుతుంది. రాజకీయాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ సినిమాల్లో ఉంటుంది. అటు ఇటు అయ్యింది. అంతా రివర్స్ లో నడుస్తుందని అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లో ఆమె ఎవరినీ ట్యాగ్ చేయలేదు. దాంతో మరలా అనుమానాలు మొదలయ్యాయి. పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో వాదనలు మొదలయ్యాయి. కొందరేమో చెప్పేది ఏదో నేరుగా చెప్పండి. ఈ డొంక తిరుగుడు ఎందుకంటున్నారు. మొత్తంగా పూనమ్ కౌర్ తన ట్వీట్ తో అందరినీ ఆలోచనలో పడవేసింది. అయితే బ్రో మూవీ విషయంలో చిత్ర యూనిట్ కి ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
ఈ పరిణామాల గురించే పూనమ్ కౌర్ ట్వీట్ చేశారని కొందరు భావిస్తున్నారు. పూనమ్ కౌర్ 2006లో మాయాజాలం అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తెలుగు తమిళ భాషల్లో పాతిక చిత్రాలకు పైగా చేసింది. పూనమ్ కౌర్ కి బ్రేక్ రాలేదు. ఆమె సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ కి మాత్రమే పరిమితమయ్యారు. పూనమ్ చివరి చిత్రం నాతిచరామి. గత ఏడాది విడుదలైంది.
Politics has become so entertaining ,
Entertainment has become so serious !!!#justthoughts
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 1, 2023