Bigg Boss 10 Telugu: అట్టహాసంగా భారీ అంచనాల నడుమ మొదలైన ‘బిగ్ బాస్ 10’ షో మొదటి ఎపిసోడ్ నుండే చాలా ఆసక్తికరంగా మారింది. 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టగా, అందులో 10 మంది చేతుల్లో పవర్ కీస్ పెట్టడం, ఆ పవర్ కీస్ రాబోయే రోజుల్లో చాలా కీలక పాత్ర పోషించబోతుండడం ఆసక్తికరమైన విషయం గా మారింది. అంతే కాకుండా మొదటి రోజు నుండే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. ఈ గొడవల్లో ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ గా ఉన్నారు అనేది చెప్పడం చాలా కష్టం గా మారింది. ఎందుకంటే ఇరువైపులా గన్ షాట్ లాంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే టాస్క్ వేరే లెవెల్ లో ఉండనుంది.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మీరంతా నిన్నటి ఎపిసోడ్ చివర్లో చూసే ఉంటారు. ఈ టాస్క్ ఆడేందుకు కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. ఒక టీం కి రోహిత్ లీడర్ కాగా, మరో టీం కి ఆటో రాంప్రసాద్ లీడర్. రోహిత్ టీం లో టెంపర్ వంశీ, షాలిని , అమన్, శ్రేష్టి , చరణ్ , చైత్ర వంటి వారు ఉంటారు. మిగిలిన వాళ్ళు రామ్ ప్రసాద్ టీం లో ఉంటారు. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లోకి కొంతమంది పోలీస్ రూపం లో వచ్చి కంటెస్టెంట్స్ పై దాడులు చేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సస్పెన్స్.ఈ టాస్క్ లో ఆటో రాంప్రసాద్ టీం గెలిచినట్టు సమాచారం. రోహిత్ టీం ఓడిపోవడం తో , అతని టీం నుండి చరణ్ ఎలిమినేట్ అయ్యాడట. ఈ కారణం చేత చరణ్ డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.
మరి రోహిత్ టీం ఎలా ఓడిపోయింది?, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆడినా ఓడిపోయారా?, లేదంటే సరిగా ఆడలేక ఓడిపోయారా?, ఒకవేళ రోహిత్ టీం లీడర్ గా విఫలమైతే , అతని గ్రాఫ్ కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఓటింగ్ లో రోహిత్ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు. ఈ టాస్క్ లో ఒకవేళ త్రిగున్ , ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు అద్భుతంగా ఆడుంటే, కచ్చితంగా వీరిలో ఎవరో ఒకరు రోహిత్ కి ఓటింగ్ లో టఫ్ పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఒక్క టాస్క్, కంటెస్టెంట్స్ ఓటింగ్ గ్రాఫ్ లో మార్పులు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.