Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో విలన్ గా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మని తీసుకున్నారు. అయితే అతని స్థానంలో మొదట ఒక తెలుగు హీరోని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదు నిజానికి దివ్యేందు శర్మ ఈ సినిమాకి ఎంత బాగా సెట్ అయ్యాడనే విషయం పక్కనబెడితే అతని ప్లేస్ లో తెలుగులో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బండి సరోజ్ కుమార్ ని తీసుకోవాలనుకోవడం విశేషం… ఆయన నిర్బంధం, మాంగల్యం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అలాగే అతనికి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అతను ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యేవాడని బుచ్చిబాబు భావించాడు.
కానీ అతను తను మాత్రం తన సినిమాలోనే హీరోగా నటిస్తానని ఇతర హీరో సినిమాల్లో నటించలేనని కరాకండిగా చెప్పడంతో బుచ్చిబాబు దివ్యేందు శర్మ దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికైతే ఆ పాత్ర బండి సరోజ్ కుమార్ చేసి ఉంటే బాగుండేదేమో అని సినిమా చూడక ముందు నుంచే చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో దివ్యేందు శర్మ పోషించిన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట.
అది హీరో రామ్ చరణ్ ను ఢీకొట్టే పాత్ర కావడంతో బండి సరోజ్ కుమార్ చేసి ఉంటే బాగుండేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దివ్యేందు శర్మ కూడా చాలా మంచి నటుడు. ఆయన ఆ పాత్రలో బాగా నటించి ప్రేక్షకులను మెప్పించాడా…తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలిగాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక బుచ్చిబాబు ఇంతకు ముందు ఉప్పెన సినిమా చేశాడు. ఈ సినిమాతో 100 కోట్లు కలెక్షన్స్ ని కొల్లగొట్టినప్పటికి అతను పెద్ద హీరోని ఇప్పటివరకు హ్యాండిల్ చేయలేదు. ఇక రామ్ చరణ్ ను ఎలా హ్యాండిల్ చేశాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
