Sree Vishnu Peddi: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ మేనియా నే కనిపిస్తోంది. థియేటర్స్ లో అభిమానులు ఈ సినిమాకు చేసిన హంగామా వీడియోస్ ని చూస్తే ఎవరికైనా కడుపు నిండిపోతుంది. నాలుగు నెలల నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక , కరువు లో ఉన్న టాలీవుడ్ కి ఈ చిత్రం కొత్త పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్, థియేటర్స్ సరిపోక , అదనపు థియేటర్స్ ని జత చేయడం, ఇలా జరగడం చూసింది చివరి సారిగా సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికే. ఆ తర్వాత ఆయన అబ్బాయి కే అలాంటి వైభోగాన్ని చూసే పరిస్థితి వచ్చింది. ఈ సినిమాకు కేవలం అభిమానులు , మూవీ లవర్స్ మాత్రమే కాదు , సినీ సెలెబ్రిటీలు కూడా థియేటర్స్ కి క్యూలు కట్టారు.
వారిలో మోస్ట్ క్రేజీ హీరో శ్రీ విష్ణు కూడా ఉన్నాడు. నేడు ఆయన ఒక థియేటర్ లో పెద్ది చిత్రాన్ని వీక్షించి , కెమెరా కి కనిపించకుండా, దొంచాటున వెళ్లిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. శ్రీ విష్ణు సాధారణంగా ఇంతటి పబ్లిక్ థియేటర్స్ లో సినిమాలు చూసే రకం కాదు , అలాంటి ఆయన కూడా ఈ చిత్రాన్ని ఒక మాస్ థియేటర్ లో అభిమానుల మధ్య చూసి ఎంజాయ్ చెయ్యాలని కోరుకున్నదంటే , ఈ చిత్రం ఏ రేంజ్ అంచనాలను ఏర్పాటు చేసిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం శ్రీవిష్ణు మాత్రమే కాదు , రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా నిన్న శ్రీరాములు థియేటర్ లో అభిమానులతో కలిసి సినిమా చూసి , పేపర్స్ గాల్లోకి ఎగురవేస్తూ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అదే విధంగా రాజమౌళి కుటుంబం మొత్తం నిన్న AMB సినిమాస్ లో ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇక మాస్ మహారాజ రవితేజ కుమారుడు మహాధాన్ కూడా ఈ చిత్రాన్ని AMB సినిమాస్ లో వీక్షించాడు , అందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శ్రీవిష్ణు వీడియో నే చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. చాలా కాలం తర్వాత ఒక సినిమాకు సినీ సెలబ్రిటీలు సైతం క్యూలు కట్టడం ఈ చిత్రానికే జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంతటి ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో చూడాలి.
View this post on Instagram
