కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో రెండు నెలల పాటు దేశంలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. నాలుగో దశలో కొన్ని సడలింపులు ఇవ్వడంతో చాలా మందికి ఊరట లభించింది. అయితే, షూటింగ్స్ ఇంకా అనుమతి రాకపోవడంతో సినీ సెలబ్రిటీలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సుదీర్ఘ విరామ సమయంలో తమకు తోచిన పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. మరికొందరేమో ఈ బ్రేక్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో ఒకరు హీరోయిర్ నిధి అగర్వాల్.
బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యువ నటి ఇస్మార్ట్ శంకర్ లో మెప్పించింది. టాలీవుడ్లో ఈ మధ్యే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలు పోషించాలని అనుకుంటున్న ఈ ఇస్మార్ట్ బ్యూటీ తన నటనా నైపుణ్యాలకు మరింత పదును పెడుతోంది. ఇందు కోసం లాక్డౌన్ బ్రేక్ను ఉపయోగించుకొంటోంది. ఈ టైమ్లో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఆన్లైన్లో యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అయింది. షూటింగ్ మొదలైతే మళ్లీ బిజీగా మారుతాను కాబట్టి ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా అని నిధి చెబుతోంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ కోర్సు ద్వారా తన నటనా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్నాఅని చెప్పింది.
నటనతో పాటు ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలి, దానికి తగట్టు ఎలా నటించాలి, ఏ పాత్రకు ఎలాంటి మేకప్ వేసుకుంటే బాగుటుంది అనే అంశాలపై తర్పీదు పొందుతున్నానని చెప్పింది. అంతర్జాతీయ సినీ నిపుణులు ఇచ్చిన సూచనలతో ఈ కోర్సు నడుస్తోందని తెలిపింది. తనకు నటన రాదని కాదు గానీ..కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలు కావడంతో తన ప్రతిభను మరింత మెరుగు పరుచుకుంటున్నాని చెబుతోంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదన్నది. ఈ కోర్సు ద్వారా తాను చాలా విషయాలు నేర్చుకున్నానని వాటిని ఎప్పుడు ఆచరణలో పెడదామా అని ఎదురు చూస్తున్నానని అంటోంది ఈ అమ్మడు. ఇప్పటిదాకా తన అందాలతో అలరించిన నిధి ఇకపై తన నటనా నైపుణ్యాలతో మరింత మెప్పించేందుకు రెడీ అయింది.