Homeఎంటర్టైన్మెంట్Nithya Menen: ఒక ఈవెంట్ లో నిత్యామీనన్ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు...

Nithya Menen: ఒక ఈవెంట్ లో నిత్యామీనన్ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు…

Nithya Menen: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తన అందంతో, అభినయంతో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా నిత్యామీనన్ చేసిన ఒక పనిపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈమె ప్రవర్తనపై సోషల్ మీడియాలో నేటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ నిత్యామీనన్ ఒక ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఆ ఈవెంట్ లో నిత్యామీనన్ మేనేజర్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. అదే ఈవెంట్ లో ఆమె డైరెక్టర్ మిష్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని హగ్ చేసుకుంది. దాంతో వ్యక్తుల స్థాయికి నిత్యామీనన్ ప్రవర్తిస్తున్నారని, ఇది సరైనది కాదని సోషల్ మీడియా ద్వారా పలువురు నెట్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే హీరోయిన్ నిత్యామీనన్ భారతీయ నటితోపాటు, గాయని కూడా. ఈమె పలు సినిమాలలో నటించడంతోపాటు, పాటలు పాడడం కూడా జరిగింది. ఈమె మొదటిసారిగా ఎనిమిది సంవత్సరాల చిన్న వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ద మంకీ హ్యు న్యూ టూ మచ్ అనే ఆంగ్ల చిత్రంలో నటించడం జరిగింది. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ టబుకు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత నిత్యామీనన్ 17 సంవత్సరాల వయస్సులో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్రలో నటించింది. ఆ తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళం సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. నిత్యా మీనన్ 1988లో బెంగళూరులో సెటిల్ అయినా మలయాళీ కుటుంబంలో జన్మించింది.

నటిని అవుతానని నిత్యామీనన్ ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ తర్వాత ఆమెకు నటన మీద ఉన్న ఆసక్తితో పూణేలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్స్ లో చేరింది. అక్కడ నిత్యామీనన్ కు బి వి నందిని రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే నిత్యామీనన్ నందిని రెడ్డి దర్శకత్వంలో అలా మొదలైంది అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో ఆకట్టుకొని నిత్యామీనన్ ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ప్రముఖ నటుడు మోహన్ లాల్ తో కూడా ఈమె ఒక సినిమాలో నటించింది.

నిత్యామీనన్ మాతృభాష మలయాళం అయినప్పటికీ ఆమెకు ఇతర భాషలు నేర్చుకోవాలంటే ఎంతో ఆసక్తి. ఆసక్తితోనే నిత్యామీనన్ తన తొలి సినిమా అలా మొదలైంది లో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, అబ్బబ్బో అబ్బో అనే రెండు పాటలను పాడింది. ఇక ఈమె తెలుగులో అలా మొదలైంది సినిమా తర్వాత సెగ, 180, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి పలు సినిమాలలో నటించింది. ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి.ఈ రెండు సినిమాలలోనూ నిత్యా మీనన్ హీరో నితిన్ కు జోడిగా నటించడం తో వాళ్ళిద్దరిది హిట్ పెయిర్ అని కూడా టాక్ వచ్చింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper