సౌత్ క్వీన్ నయనతార సంచలనం నిర్ణయం తీసుకుంది. లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. ఆమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు పడిగాపులు కాస్తుంటారు. దీంతో ఆమె పెట్టే కండీషన్లకు దర్శక, నిర్మాతలు ఓకే చెబుతుంటారు. సినిమా డేట్ల విషయంలో నయన్ ఖచ్చితంగా ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలో సినిమా ప్రమోషన్లో పాల్గొన్న నయనతార ఆ తర్వాత సినిమా ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఈ విషయంలో ఆమె దర్శక, నిర్మాత మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న సంగతి తెల్సిందే. అయితే నయనతార తాజాగా తన సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా నయనతార ఓ మలయాళ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో తాను పాల్గొంటానని సదరు దర్శక నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నయన మల్టిషెడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించనుందని సమాచారం. దక్షిణాదిలో పలు సినిమాల్లో నయనతార నటిస్తూ బీజీగా ఉంది. ఇప్పటివరకు ఆమె సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోయినప్పటికీ నయనతార నటించిన చిత్రాలు విజయవంతం అవుతుండటంతో దర్మక, నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.
ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించిన దర్బార్, విజయ్ తో నటించిన ‘విజిల్’, మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘సైరా’ చిత్రం ప్రమోషన్లలో కూడా ఆమె పాల్గొనకపోవడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. నయనతార ‘సైరా’ ప్రమోషన్లలో పాల్గొనకపోవడంతో చిరంజీవి ఆమెను ఇన్ డైరెక్టర్ గా టార్గెట్ చేశాడు. సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నాను పొడుగుతూ నయనతారను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి నయనతార తన నిర్ణయాలపై సమీక్షించుకుంటోంది. తాజాగా ఆమె ఓ మలయాళ చిత్ర ప్రమోషన్లలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Nayanthara ready for movie promotion
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com