Mr Bachchan Produced
Mr Bachchan Produced : సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ బ్యానర్స్ లో ఒకటిగా నిల్చింది ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ. అయితే ఈ సంస్థ నుండి ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో హిట్ అయినా వాటికంటే ఫ్లాప్ అయినవే ఎక్కువగా ఉన్నాయి. ఈ సంస్థ నుండి విడుదలైన చిత్రాలలో ఇప్పటి వరకు ‘ఓ బేబీ’, ‘గూడచారి’, ‘వెంకీ మామ’, ‘కార్తికేయ 2 ‘, మరియు ‘ధమాకా’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలవగా బ్రో, ఈగల్, మిస్టర్ బచ్చన్, రామ బాణం వంటి చిత్రాలు దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. పైన చెప్పిన సూపర్ హిట్ సినిమాలలో ‘ధమాకా’ చిత్రం ఒక్కటే ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ నుండి వచ్చిన సోలో హిట్. మిగిలిన చిత్రాలన్నీ వేరే ప్రొడక్షన్ హౌస్ లతో కలిసి నిర్మించినవే. అంతే కాకుండా ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసి భారీ నష్టాలను చవిచూసింది.
ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం రీసెంట్ గా విడుదలై ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. ఇప్పుడు ఈ సంస్థ నుండి శ్రీ విష్ణు హీరో గా ‘స్వాగ్’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేస్తూ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు . ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ఈ నిర్మాణ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈమధ్య మీ కంపెనీ నుండి వస్తున్న సినిమాలన్నీ భారీ ఫ్లాప్స్ అవుతున్నాయి. బాగా నష్టాల్లో మునిగిపోయినట్టు ఉన్నారు’ అని అడగగా, దానికి విశ్వ ప్రసాద్ సమాధానం చెప్తూ ‘సినిమా అన్న తర్వాత హిట్లు, ఫ్లాపులు రావడం సర్వసాధారణం. మాకు వచ్చిన నష్టాలను మొత్తం ప్రభాస్ తో ప్రస్తుతం మేము చేస్తున్న ‘రాజా సాబ్’ పూడుస్తుంది’ అంటూ బదులిచ్చాడు. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని ఇటీవలే విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇదే గ్లిమ్స్ వీడియో లో వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్, చాలా కాలం తర్వాత అభిమానుల కోసం పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ నెలలోనే టాకీ పార్ట్ మొత్తాన్ని ముగించుకోబోతుందని తెలుస్తుంది. చూడాలి మరి ప్రభాస్ స్టార్ స్టేటస్ అయినా ఈ సంస్థ ని కాపాడుతుందా లేదా అనేది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Mr bachchan producer makes shocking comments saying prabhas should pay for our losses
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com