Ktr: హైదరాబాద్ నగరంలో ఈ రోజు జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఒకరిపై ఒకరు సరదాగా కౌంటర్ లు వేసుకున్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ… కేటీఆర్ మంచి యాక్టర్ అన్నారు. సినిమాల్లో నటించేప్పుడు మేము క్యారక్టర్ లో పూర్తిగా లీనమైనప్పుడే బాగా చేయగలమని అన్నారు. అలాగే కేటీఆర్ కూడా ప్రజల్లో లీనమవుతాడని… అందుకే తన పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడు అన్నారు సుధీర్ బాబు.
అందుకు సమాధానంగా కేటీఆర్ మాట్లాడుతూ… తాను ఇన్నిరోజులు పొలిటీషియన్ ను అనుకున్నాను. కానీ సుధీర్ బాబు యాక్టర్ గా గుర్తించాడని అన్నారు. అంటే మేమంతా నటిస్తున్నామా అంటూ కేటీఆర్ ఫన్నీగా మాట్లాడారు. 2018లో ఈ కార్యక్రమం లో పాల్గొన్నప్పుడే ఇది ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి కార్యక్రమం అవుతుంది అనుకున్నానని వెల్లడించారు కేటీఆర్. ఇండియా లో ఇంటర్నెట్ యూజర్స్ రోజురోజుకి పెరుగుతున్నారన్నారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4% పెరుగుతుందని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఓటీటీ , గేమింగ్ కు ఆధరణ పెరుగుతోందని… తాను ఓటీటీ కి అభిమానిని అని వెల్లడించారు మంత్రి కేటీఆర్.
ఇటీవలే సుధీర్ బాబు నటించిన ” శ్రీదేవి సోడా సెంటర్ ” సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కాగా సుధీర్ బాబు ప్రస్తుతం మాయదారి మల్లిగాడు, అగ్గిపుల్ల వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వీరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Minister ktr counter to actor sudheer babu words about him
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com