‘సూపర్ స్టార్ మహేష్ బాబు’కు ఒక ఆనవాయితీ ఉంది. తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున తన సినిమాకి సంబంధించి టీజర్ నో, ట్రైలర్ నో రిలీజ్ చేయడం మహేష్ కి బాగా ఇష్టం. ఐతే, మే 31న కృష్ణ పుట్టిన రోజు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉంది. అయినా మహేష్ ఇష్టాన్ని కాదనలేక ‘సర్కారు వారి పాట’ టీమ్ ఈ సినిమా టీజర్ ను రెడీ చేయడానికి సన్నాహాలు చేసింది.
అయితే, ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ లో టీజర్ ను కట్ చేసేంత ఫుటేజ్ లేదని, దుబాయ్ లో జరిగిన 15 రోజుల షెడ్యూల్ లో కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ను మాత్రమే తెరకెక్కించారని, ఆ కారణంగా ఇప్పుడు చేతిలో ఉన్న 15 నిమిషాల ఫుటేజ్ లో టీజర్ కట్ చేసే షాట్స్ ఎక్కువ లేవని పరుశురామ్ డైలమాలో పడ్డాడు.
అందుకే పరుశురామ్ 30 సెకన్ల గ్లింప్స్ని కట్ చేసి, ఫ్యాన్స్ కోసం ఒక పవర్ డైలాగ్ ను మిక్స్ చేసి రిలీజ్ చేద్దామని మహేష్ ను అడిగాడట. ప్రస్తుతం మహేష్ కి ఆ 30 సెకన్స్ గ్లింప్స్ ను చూపించడానికి రెడీ అవుతున్నాడు పరుశురామ్. మహేష్ కి నచ్చితేనే ఈ గ్లింప్స్ రిలీజ్ కూడా ఉంటుంది. లేదంటే పోస్టర్ తోనే సూపర్ స్టార్ కృష్ణకు బర్త్ డే విషెష్ చెప్పాల్సి వస్తోంది.
మరి చూడాలి గ్లింప్స్ వస్తోందో, లేక పోస్టర్ వస్తోందో ?, గత ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ని ప్రకటించి, కృష్ణగారికి మంచి గిప్ట్ ఇచ్చాడు మహేష్. అలాగే ఈ పుట్టినరోజుకి కూడా సర్కారు వారి పాటకు సంబంధించే ఏదోకటి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి, కచ్చితంగా ఈ సినిమా నుండే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న మహేష్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు.