Homeఎంటర్టైన్మెంట్కియారా అద్వానీ కి టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ

కియారా అద్వానీ కి టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ


తెలుగు సినిమా కి హీరోయిన్ ల కొరత బాగా ఉంది. యువ హీరోల సరసన నటించేందుకు అందం , అభినయం ఉన్న హీరోయిన్ లు దొరకడం లేదు. దాంతో హిందీ , మలయాళం , కన్నడ భాషల నుంచి కథానాయికలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇపుడున్న పూజా హెగ్డే , రష్మిక మందన్న ఇద్దరు కూడా కన్నడ భామలే. తమన్నా , కాజల్ , త్రిష లాంటి పరభాషా తారలు మన యువ హీరోల పక్కన చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా లేరు . దాంతో నిత్యాన్వేషణ తప్పడం లేదు .

రాబోయే కొత్త చిత్రాల్లో మన యువ హీరోలకు తగిన జోడీ దొరకక పోవడం తో అందరి చూపు ఇపుడు బాలీవుడ్ హీరోయిన్ ఫై పడింది. గతంలో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి తెలుగు చిత్రాలలో నటించిన కియారా అద్వానీ ఫై వీరి చూపు పడింది. నిజం చెప్పాలంటే కియారా అద్వానీ కి ఇపుడు హిందీలో బాగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కియారా అద్వానీ హిందీలో ` లక్ష్మి బాంబ్ `,` ఇందూ కి జవానీ `, `షేర్ షా `, ` భూల్ బలయ్యా 2 ` చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది .అందం , నటన ఉన్న కియారా అద్వానీ కి ఇప్పుడు టాలీవుడ్ నుంచి మూడు బిగ్ ఆఫర్లు వెళ్లినట్టు తెలుస్తోంది. విశేషం ఏంటంటే ఆ మూడు చిత్రాలు కూడా టాప్ స్టార్స్ నటించే సినిమాలే …అందులో ఒకటి మహేశ్ బాబు- పరశురాం కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న చిత్రం కాగా రెండోది ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా కాంబో లో వస్తున్న రెండో చిత్రం. ఇక ప్రభాస్- మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ల కాంబో లో రూపొంద బోతున్న భారీ బడ్జట్ చిత్రం కోసం కూడా కియారా అద్వానీ ని సంప్రదిస్తునట్టు తెలుస్తోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular