‘మహానటి’ కీర్తి సురేష్ పెళ్లి ఖరారైనట్లు నెట్టింట్లో వార్తలు హల్చల్ చేశాయి. జాతీయ మీడియా సంస్థలు కూడా కీర్తి సురేష్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేశాయి. దీంతో సినిమాల్లో బీజీగా ఉన్న కీర్తి సురేష్ ఇంత సడెన్ గా పెళ్లి చేసుకోనుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలో నిజంలేదని స్పష్టం చేశారు.
తాను ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉన్నానని చెప్పింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు తన కాల్షీట్స్ డైరీ ఫుల్గా ఉందని తెలిపారు. ఈ తరుణంలో పెళ్లి ఎలా చేసుకుంటానని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయకండి అంటూ కీర్తి సురేష్ విజ్ఞప్తి చేసింది. కీర్తి సురేష్ ప్రస్తుతం నితిన్ సరసన ‘రంగ్ దే’ మూవీలో నటిస్తుంది. అదేవిధంగా సూపర్స్టార్ రజినీకాంత్-శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అణ్ణాత్త’ మూవీ నటిస్తుంది.
‘నేను శైలజ’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ‘మహానటి’తో జాతీయ అవార్డు దక్కించుకుంది. అందం, అభినయం ఉన్న కొద్దిమంది నటీమణుల్లో కీర్తి సురేష్ ఒకరు. తాజాగా ఆమె పెళ్లి వార్త నేపథ్యంలో ఆమె అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని నటనకు దూరమైపోతుందనే భావనలో ఉన్నారు. తాజాగా తనపై ‘మహానటి’ క్లారిటీ ఇవ్వడంతో కీర్తీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.