Homeఎంటర్టైన్మెంట్అన్నపూర్ణగా మారిన రకుల్ ప్రీత్ సింగ్

అన్నపూర్ణగా మారిన రకుల్ ప్రీత్ సింగ్


కరోనా భాదితులను ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి హీరోలు బాగా ముందుకొచ్చారు .మెగా స్టార్ దగ్గరం నుంచి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దాకా అందరూ స్పందించారు. తమ శక్తి కొలది ఆర్ధిక విరాళాలు ఇచ్చారు . కానీ ఈ విషయం లో హీరోయిన్ లు , లేడీ ఆర్టిస్ట్ లు ఎందుకో వెనుక బడ్డారు. అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత , లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే సి సి సి పిలుపుకి స్పందించి ఆర్ధిక విరాళం ఇచ్చారు విచిత్రం ఏమిటంటే కోట్లు , లక్షల్లో అత్యధిక పారితోషకం తీసుకొనే తారామణులు కూడా .ఎటువంటి స్పందన కనబరచ లేదు. అలాంటి స్థితిలో ధ్రువ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఒక విచిత్ర వార్త తెలిసింది.

కరోనా విపత్తు వల్ల కూటికి లేక బాధపడే వారికి రకుల్ ప్రీత్ సింగ్ రోజూ భోజనం పంపిస్తోంది. చాలా గుప్తంగా జరిగే ఈ అన్నదానం అనుకోకుండా బయటికి వచ్చింది. ఆ విషయమే రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగితె అవునని ఒప్పుకొంది. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఎంతమందికి భోజనం పంపిస్తుందో తెలుసా ? సరిగ్గా రెండు వందల ( 200 ) మందికి …అదీ కూడా రెండు పూటలా పంపుతోంది. ప్రస్తుతం పెద్దగా ఫార్మ్ లో కూడా లేని రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న ఈ సాయం ఆమెకి ఒకరకం గా భారమే …అయినా గానీ ఎంతో ఆనందం తో , ఆత్మతృప్తి తో అన్నదానం చేస్తూ అన్నపూర్ణ అనిపించు కొంటోంది. పబ్లిసిటీ లేకుండా ఇలాంటి సాయం చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ని అందరూ మనస్పూర్తి గా అభినందిస్తున్నారు . a small help is greater than big words

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular