Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam Serial: కోరిక కోరిన మోనిత... ఆగ్రహంతో ఊగిపోయిన ఏసీపీ రోషిణి..!

Karthika Deepam Serial: కోరిక కోరిన మోనిత… ఆగ్రహంతో ఊగిపోయిన ఏసీపీ రోషిణి..!

Karthika Deepam Serial: Monita's Wish ACP Roshini Swayed Angrily Karthika Deepam Serial: బుల్లితెరపై అత్యధిక రేటింగ్ ను సంపాదించుకుంటూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నటువంటి కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ట్విస్టులతో.. రోజురోజుకు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా..పిల్లల పోస్టర్ లు ఆదిత్య తీసుకు వచ్చాడని పిల్లలతో అబద్ధం చెప్పిందని తెలుసుకున్న పిల్లలు దీప పై ఎంతో కోపంగా ఉంటారు. ఇదే విషయాన్ని సౌర్య కోపంతో దీపను అడిగితే దీప ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో మోనితను కోర్టుకు తీసుకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు.

ఈలోగా ఏసీపీ రోషిణి రావడంతో..ఏసీపీ రోషిణితో మోనిత తనకు ఒక కోరిక ఉందంటూ.. ఆ కోరిక తీర్చాలని అడుగుతుంది. తనని కోర్టుకు రోషిణి కారులో తీసుకు వెళ్లాలని చెప్పడంతో రోషిణి ఆగ్రహంతో ఊగిపోతూ.. నేను ఖైదీలను ఎక్కించుకోను అని గట్టిగా చెప్పిన కూడా మోనిత రోషిణిని బ్రతిమిలాడి, విసిగించి చివరికి తన కారులోనే కోర్టుకు బయలుదేరుతుంది. ఇక దీప ఇంట్లో పిల్లలు మెట్లపై కూర్చుని అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నారు.. మనతో అబద్ధం చెప్పి వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రశ్నల పై ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా అంతలో అక్కడికి సౌందర్య, కార్తీక్, దీప వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు మేము కూడా మీతో వస్తామని సౌర్య అనడంతో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.

ఇక వీరు బయలుదేరుతుండగా సౌర్య కార్తీక్ చేయి పట్టుకొని మరి ఇంటికి తిరిగి వస్తావా నాన్న.. నువ్వు బయటకు వెళ్తుంటే భయం వేస్తుంది. మళ్లీ ఇంటికి తిరిగి వస్తావు కదా అంటూ కార్తీక్ తో అనడంతో కార్తీక్ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కోర్టుకు బయలుదేరుతారు. ఇక కోర్టుకు ఏసిపి కారులో బయలుదేరిన మోనిత మనసులో ఈ ఏసీపీకి రెండు బిస్కెట్లు వేస్తామని అనుకొని మాట్లాడగా.. వెంటనే రోషిణి ఇంకెన్ని బిస్కెట్లు తీసుకొచ్చావని అనడంతో.. మోనిత షాక్ అవుతుంది. మోనితకి బాగా వార్నింగ్ ఇచ్చి తన ఓవరాక్షన్ అంతటితో ఆపుతుంది. అలాగే దీప కార్తీక్ ను పొగుడుతూ మాట్లాడటం వల్ల మోనిత మండిపడుతుంది.
మోనిత ఇలా ఏసిపి కారులో కోర్టుకు వెళ్లడం చూసిన దీప, కార్తీక్ షాక్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేసింది. ఇక కోర్టులో దీప, సౌందర్య, కార్తీక్ మోనిత నిజ స్వరూపం గురించి మాట్లాడుతున్న సమయంలో అక్కడికి మోనిత వెళుతుంది. సౌందర్యాను చూసిన మోనిత వెటకారంగా మాట్లాడటంతో సౌందర్య తనపై చేయి ఎత్తుతుంది. ఈ క్రమంలోనే ఏసిపి రోషిని సౌందర్యాన్ని కూల్ చేస్తూ ఇందాక నేను పెట్టిన గడ్డి సరిపోలేదా.. ఇప్పుడు ఇక్కడ కూడా నీకు గడ్డి కావాలా.. అంటూ రోషిని మోనితను అనడంతో దీప, కార్తీక్ నవ్వుకుంటారు.అయితే ఆ తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది ఈ సీరియల్ ఎటువైపు దారి తీస్తుందో అనేది తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular