Homeఎంటర్టైన్మెంట్పట్టువదలని విక్రమార్కుడు కమల్ హాసన్

పట్టువదలని విక్రమార్కుడు కమల్ హాసన్

చిత్ర రంగంలో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అనుకోని వడుదుడుకులు , అవాంతరాలు ఇక్కడ సహజం. అందుకే ఇక్కడ ఓడలు బండ్లు అవుతాయి. వాటిని అన్నింటిని తట్టుకొని నిలబడిన వాడే చిత్ర రంగంలో హీరో అవుతాడు. ఇపుడు కమల్ హాసన్ పరిస్థితి కూడా అదే. ఊహించని సంక్షోభం లో ఆయన కెరీర్ ఊగిసలాడుతోంది. ఈ మధ్యనే భారీ వ్యయ ప్రయాసలకు ఓర్చి భారతీయుడు సీక్వెల్ సినిమా ఆరంభిస్తే అదికాస్తా ఆగిపోయింది. షూటింగ్ సమయంలో ఊహించని ప్రమాదం జరిగి ముగ్గురు సాంకేతిక నిపుణులు చనిపోవడం జరిగిది.దాంతో యూనిట్ కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అలా ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఐనా గాని కమల్ హాసన్ అధైర్య పడకుండా మరో రెండు సీక్వెల్స్ కి శ్రీకారం చుట్ట బోతున్నాడు.

1992. అక్టోబర్ 25 న విడుదలై ఘన విజయం సాదించిన కమల్ హాసన్ చిత్రం తేవర్ మగన్ {తెలుగులో క్షత్రియ పుత్రుడు } ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దాన్ని నిర్మిస్తుంది మరెవరో కాదు సాక్షాత్తు ఆ చిత్ర కథానాయకుడు కమల్ హాసనే. తలైవన్ ఇరుక్కిన్ డ్రాన్ పేరుతొ తెరకెక్క బోతున్న ఈ చిత్రం ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్సకత్వంలో సంగీత సొగసులు అద్దుకో బోతోంది. ఇక ఈ చిత్రం తో పాటు మరో చిత్రం కూడా సీక్వెల్ గా రూపొంద బోతోంది.

2006 వ సంవత్సరం లో కమల్ హాసన్ , కమలిని ముఖర్జీ జంటగా నిర్మించబడి సూపర్ హిట్ అయిన వెట్టై యాడు విలయాడు (తెలుగులో రాఘవన్ ) చిత్రం ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ గత చిత్ర నిర్మాత ఇసారి గణేష్ నేతృత్వం లోనే నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్ర నిర్మాణానికి కూడా కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెల్సింది.
Confidence is strength

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular