చిత్ర రంగంలో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అనుకోని వడుదుడుకులు , అవాంతరాలు ఇక్కడ సహజం. అందుకే ఇక్కడ ఓడలు బండ్లు అవుతాయి. వాటిని అన్నింటిని తట్టుకొని నిలబడిన వాడే చిత్ర రంగంలో హీరో అవుతాడు. ఇపుడు కమల్ హాసన్ పరిస్థితి కూడా అదే. ఊహించని సంక్షోభం లో ఆయన కెరీర్ ఊగిసలాడుతోంది. ఈ మధ్యనే భారీ వ్యయ ప్రయాసలకు ఓర్చి భారతీయుడు సీక్వెల్ సినిమా ఆరంభిస్తే అదికాస్తా ఆగిపోయింది. షూటింగ్ సమయంలో ఊహించని ప్రమాదం జరిగి ముగ్గురు సాంకేతిక నిపుణులు చనిపోవడం జరిగిది.దాంతో యూనిట్ కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అలా ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఐనా గాని కమల్ హాసన్ అధైర్య పడకుండా మరో రెండు సీక్వెల్స్ కి శ్రీకారం చుట్ట బోతున్నాడు.
1992. అక్టోబర్ 25 న విడుదలై ఘన విజయం సాదించిన కమల్ హాసన్ చిత్రం తేవర్ మగన్ {తెలుగులో క్షత్రియ పుత్రుడు } ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దాన్ని నిర్మిస్తుంది మరెవరో కాదు సాక్షాత్తు ఆ చిత్ర కథానాయకుడు కమల్ హాసనే. తలైవన్ ఇరుక్కిన్ డ్రాన్ పేరుతొ తెరకెక్క బోతున్న ఈ చిత్రం ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్సకత్వంలో సంగీత సొగసులు అద్దుకో బోతోంది. ఇక ఈ చిత్రం తో పాటు మరో చిత్రం కూడా సీక్వెల్ గా రూపొంద బోతోంది.
2006 వ సంవత్సరం లో కమల్ హాసన్ , కమలిని ముఖర్జీ జంటగా నిర్మించబడి సూపర్ హిట్ అయిన వెట్టై యాడు విలయాడు (తెలుగులో రాఘవన్ ) చిత్రం ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ గత చిత్ర నిర్మాత ఇసారి గణేష్ నేతృత్వం లోనే నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్ర నిర్మాణానికి కూడా కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెల్సింది.
Confidence is strength
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Kamal haasan to start this blockbuster sequel
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com