Junior NTR : నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నప్పటికీ తన తదుపరి సినిమాలతో కూడా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్న క్రమం లో వీళ్ళ కాంబినేషన్ సినిమా రావడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక రీసెంట్ గా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్న ఈ సినిమా తొందర్లోనే ఈ సినిమా రెగ్యూలర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో ఈ సినిమాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఒక్కసారి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లిందంటే చాలా ఫాస్ట్ గా సినిమాను పూర్తి చేసి వీలైనంత తొందరగా సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం నెట్టింట్లో ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది.
అది ఏంటి అంటే డ్రాగన్ సినిమాకు సంబంధించిన స్టోరీ లీక్ అయింది అంటూ నెట్టింట్లో చాలా కామెంట్లు రావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ లీకైన స్టోరీని కనక చూసినట్టైతే ఎన్టీఆర్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టబోతున్నాడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా ఒక పీడిత ప్రాంతానికి సంబంధించిన ప్రజల సినిమాగా తెలుస్తుంది. ఒకరి దగ్గర బందీగా ఉన్న జనాలను హీరో ఎలా కాపాడాడు. తద్వారా ప్రజలకు ఈ భూమి మీద బతికే అవకాశాన్ని ఎలా ఇచ్చాడు. అనే పాయింట్ ను చాలా స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నంలోనే ప్రశాంత్ నీల్ చాలా ఎమోషన్స్ తో కూడుకున్న కథను రాసుకున్నాడంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మరి ఆ పీడిత ప్రాంత ప్రజలు ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులని వాళ్లను కాపాడడమే ఎన్టీఆర్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడని కూడా తెలుస్తుంది… మరి ఇదే కథతో ఈ సినిమా వస్తుందా? లేదంటే కావాలనే ఇలాంటి కథను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారా అనే విషయాల మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ మొత్తానికైతే ఈ కథ కూడా ఎన్టీఆర్ స్టామినా ను చూపించే కథగానే కనిపిస్తుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More