Homeఆంధ్రప్రదేశ్‌Industry Ap Government Meet: రేపు సీఎం చంద్రబాబు తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..అందుబాటులో లేని...

Industry Ap Government Meet: రేపు సీఎం చంద్రబాబు తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..అందుబాటులో లేని పవన్ కళ్యాణ్!

Industry AP Government Meet: తెలుగు సినీ ప్రముఖులందరూ రేపు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ని సచివాలయం లో కలవబోతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో జరిగిన కొన్ని అనూహ్యమైన పరిణామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫైర్ అవ్వడం, కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సినీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవకపోవడం పై ఆయన తప్పుబట్టడం వంటి సంఘటనలు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. అందుకే నిర్మాతలందరూ ఒక తాటి పైకి వచ్చి రేపు ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు ని కలిసే ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి, ఆయనతో పాటు సీఎం వద్దకు వెళ్లాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేదట,సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇకపోతే రేపు ముఖ్యమంత్రి తో వీళ్లంతా ఏ విషయాలపై చర్చలు జరపబోతున్నారో చూడాలి.

Also Read: Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ సంచలన ప్రెస్ మీట్..వివాదం ముదిరింది!

నిన్న మొన్నటి వరకు మన టాలీవుడ్ లో టికెట్ హైక్స్ కోసం నిర్మాతలు కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది, క్షణాల్లో జీవో నో జారీ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫిలిం ఛాంబర్ లో దరఖాస్తు చేసుకుంటే, ఆ తర్వాత దానిని పరిశీలించి, టికెట్ రేట్స్ అవసరం అయితేనే పెంచుతారు. ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమనేలా సీఎం చంద్రబాబు ని సినీ పెద్దలు రిక్వెస్ట్ చేయబోతున్నారా..?, లేకపోతే సినీ ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో పరిష్కారం కానీ సమస్యల గురించి చర్చించబోతున్నారా?. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరగదు. మీరే సమయం చూసుకొని ఆయన్ని ఒప్పించేలా చేసుకోండి అని అనొచ్చు. కాబట్టి టికెట్ రేట్స్ వ్యవహారం గురించి మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ. ఒకప్పుడు నంది అవార్డ్స్ అనేది ఎంత ఫేమసో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Also Read: Hari Hara Veeramallu : సోమవారం రోజున ‘హరి హర వీరమల్లు’ నిర్మాత సంచలన ప్రెస్ మీట్..విషయం ఏమిటంటే!

ఒక నటుడుకి కానీ, నటి కి కానీ నంది అవార్డు ని తమకు దక్కిన ఎంతో గొప్ప గౌరవంగా భావించే వారు. అయితే జగన్ సీఎం అయ్యాక ఈ నంది అవార్డ్స్ ప్రస్తావన లేకుండా పోయింది. అందుకే ఇక నుండి నంది అవార్డ్స్ ని పునః ప్రారంభించాలనే రిక్వెస్ట్ ని సినీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు ని కోరే అవకాశాలు ఉన్నాయి. నేడు తెలంగాణ లో ‘గద్దర్ అవార్డ్స్’ ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించబోతుంది. ఈ నేపథ్యం లో కచ్చితంగా రేపటి చర్చ లో నంది అవార్డ్స్ ప్రస్తావన వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్,మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవి శంకర్ వంటి వారితో పాటు టాలీవుడ్ లో పలువురు సీనియర్ హీరోలు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular