Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Political Survey: ఏపీలో కీలక సర్వే : కూటమి వర్సెస్ వైసీపీ.....

Andhra Pradesh Political Survey: ఏపీలో కీలక సర్వే : కూటమి వర్సెస్ వైసీపీ.. గెలుపు ఎవరిదంటే..

Andhra Pradesh Political Survey: ఏపీలో రాజకీయాలు ఎప్పటికీ హాట్ గానే ఉంటాయి. కులాలు అక్కడ ఎక్కువ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అక్కడ నాయకుల వ్యవహార శైలి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు.. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు ఎప్పటికీ అంతు పట్టదు. పైగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంలో ఏపీ రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో ఈ పార్టీ, ఆ పార్టీ అని తేడా […]

Andhra Pradesh Political Survey: ఏపీలో రాజకీయాలు ఎప్పటికీ హాట్ గానే ఉంటాయి. కులాలు అక్కడ ఎక్కువ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అక్కడ నాయకుల వ్యవహార శైలి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు.. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు ఎప్పటికీ అంతు పట్టదు. పైగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంలో ఏపీ రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో ఈ పార్టీ, ఆ పార్టీ అని తేడా ఉండదు.

ఏపీలో నిత్యం సర్వేలు జరుగుతూనే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ.. అధికారంలో లేని పార్టీ నిత్యం సర్వేలు జరిపిస్తూనే ఉంటాయి. సమీకరణాలు.. జనాల మనోగతం.. ఇతర అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా రాజకీయాలు చేస్తూ ఉంటాయి. ఇటీవల వైసిపికి అనుకూలంగా ఉండే ఒక డిజిటల్ మాధ్యమం సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. అంతేకాదు ఆ ఫలితాలను బయటికి చెప్పకుండా.. ఆ డిజిటల్ మాధ్యమ నిర్వాహకులు తెలివిగా సీన్ డైవర్ట్ చేయడానికి.. ఆన్లైన్లో ఒక పోల్ పెట్టారు. అందులో కూడా దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ డిజిటల్ మాధ్యమంలో పెట్టిన పోల్ ఆధారంగా పరిశీలిస్తే కూటమి ప్రభుత్వానికి 61% ఓటు బ్యాంకు పెరిగింది.. గతంతో పోల్చి చూసుకుంటే ఇది చాలా ఎక్కువ. ఈ ప్రకారం 150 కి పైగా స్థానాలు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ఇక వైసిపికి ఓటు బ్యాంకు 31 శాతానికి పడిపోయింది. గతంలో 40 శాతం ఓట్లు వస్తే 11 స్థానాలు మాత్రమే వైసిపికి వచ్చాయి. ఇప్పుడు ఓట్ల శాతం 31 కు పడిపోతే 8 సీట్లు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వైసిపి ఆస్థాన డిజిటల్ మీడియాలో పరిస్థితి ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో జనం ఏమనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి పరిపాలన జనాలకు ఇంత బాగా నచ్చినప్పుడు.. వైసీపీ వాళ్లు ఇంకా రాజకీయాలు చేయడం దేనికని విశ్లేషకులు అంటున్నారు.

ఐదేళ్ల పరిపాలన కాలంలో అన్ని అక్రమాలు జరిగాయి.. విధ్వంసాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇన్ని జరిగిన తర్వాత ప్రజలకు మేము ఇది చేశామని ఎలా చెప్పుకుంటారు.. అందువల్లే ప్రజలకు కూడా ఎవరు మంచి చేస్తారో అర్థం అయిందని.. అందువల్లే మొహమాటం లేకుండా తమ అభిప్రాయాన్ని వైసిపి ఆస్థాన డిజిటల్ మీడియాలో పేర్కొన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 8 సీట్లు మాత్రమే వస్తే వైసిపి పరిస్థితి ఊహించుకోడానికే ఇబ్బందిగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే గనక జరిగితే ఏపీ ఎన్నికల్లో వరుసగా రెండవ పర్యాయం కూడా ప్రతిపక్షం అనేది ఉండదు. ఎంతైనా ఏపీ ప్రజలు తెలివైనవారు. ఎవరికి ఓటు వేయాలి.. ఎవరికి వేటు వేయాలి వారికి బాగా తెలుసు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper