Homeఎంటర్టైన్మెంట్ఆచార్య తో జత కట్టేది చందమామ కాదు జేజమ్మ

ఆచార్య తో జత కట్టేది చందమామ కాదు జేజమ్మ

సినిమా రంగంలో నటీనటుల అవకాశాలు తరచూ మారి పోతుంటాయి. అంతా రెడీ అయ్యాక ఏదో ఒక చిన్న కారణం తో యాక్టర్లు చేంజ్ అయిన సందర్భాలు అనేకం. తాజాగా అలాంటి వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

బాహుబలి చిత్రం తో విశ్వఖ్యాతి దక్కించుకున్న అనుష్క శెట్టి ఈ మధ్య తన సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉంటోంది. బాహుబలి తరవాత అనుష్క చేసింది రెండే రెండు చిత్రాలు. అందులో ఒకటి భాగమతి కాగా రెండోది సైరా .అలా సంవత్సరానికి మహా అయితే ఒక్క సినిమా చేస్తోంది . ఇక తాజాగా నిశ్శబ్దం సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. నిజానికి ఆ సినిమా ఏప్రిల్ 2 న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఇదిలా ఉంటే అనుష్క మరో భారీ చిత్రాన్ని చేసేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుష్కకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం లభించిందిట. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమాలో మొదట త్రిషను కథానాయికగా అనుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో చిత్రం నుండి తప్పుకుంది. దాంతో ఇప్పుడు నిర్మాతలు వేరే హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు. వారి ముందుకు వచ్చిన మొదటి పేరు కాజల్ అగర్వాల్. ఇటీవలే చిరంజీవి సరసన ఖైదీ నెం 150లో నటించిన కాజల్ ను మరోసారి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. అయితే చందమామ ఈ సినిమా చేయడానికి అడిగిన పారితోషికానికి నిర్మాతలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దాంతో సైరాలో అతిధి పాత్రలో మెరిసిన అనుష్క అయితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది. గతంలో స్టాలిన్ లో చిరంజీవి సరసన ఒక స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపించిన అనుష్క కి ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారట …. opportunity comes according to behaviour

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular