Homeఎంటర్టైన్మెంట్Tollywood "వేయి శుభములు కలుగు నీకు" మూవీలో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన...

Tollywood “వేయి శుభములు కలుగు నీకు” మూవీలో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన హీరో విశాల్…

Tollywood రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో శివాజీ రాజా కుమారుడు  విజయ్ రాజా  నటిస్తున్న చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”. ఈ చిత్రాన్ని జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. అలానే తమన్నా వ్యాస్ హీరోయిన్ గా నటిస్తుండగా…  గ్యాని సంగీతం అందిస్తున్నారు. తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకి సిద్దం అవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ లోని ఒక పాటను హీరో విశాల్ రిలీజ్ చేశారు.

hero vishal released song from veyi shubhamulu kalugu neeku movie

తండ్రీ కొడుకుల మధ్య సాగే సెంటిమెంట్ సాంగ్ అయిన  “వేల స్వర్గాలు” అనే పాటను హీరో విశాల్ విడుదల చేశారు. ఒక సినిమాకు టైటిలే చాలా ముఖ్యం. దాంట్లో పాజిటివ్ టైటిలే పెట్టేది ఇంకా ముఖ్యం. ఈ సినిమాకు పెట్టిన వేయి శుభములు కలుగు నీకు టైటిల్ అంటే థౌజండ్ బ్లెస్సింగ్స్ అని అన్నారు.  ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు జరగాలని కోరుకునే విషయం ఇదే అని అన్నారు. ఈ సినిమాతో తమ్ముడు విజయ్ రాజా ఇంట్రడ్యూజ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని విశాల్ తెలిపారు. అలానే ఈ సినిమాలో  శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు శ్రీనాథ్ రెడ్డి అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular