Pawan Kalyan: పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. మొగల్ చక్రవర్తుల కాలానికి చెందిన వజ్రాల దొంగ కథ ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసి భారీ సెట్లు వేశారు. ఇప్పటికే 50 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది చిత్రబృందం. మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే, ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాకు ఒప్పుకున్న పవన్ కల్యాణ్ ఈ గ్యాప్లో భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తి చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శరవేగంగా షూటింగ్ ప్రారంభించి.. వచ్చే సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు పవన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
కాగా, ప్రస్తుతం వీలైనంత త్వరగా వీరమల్లు ప్రాజెక్టును సెట్స్పైకి తీసుకెళ్లేందుకు పవన్- క్రిష్ చూస్తున్నట్లు టాక్. దీపావళి పండుగ తర్వాత పవన్ షూటింగ్లో పాల్గొననున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినికిడి. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కె. సాగర్ చంద్ర దర్శకత్వంలో రానా- పవన్ కల్యాణ్ కలిసి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఇటీవలే విడుదలైన పవన్- రానా పాత్రలకు సంబంధించిన ప్రోమోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కాగా, దీపావళి కానుకగా లాలా భీమ్లా నాయక్ సాంగ్ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందులో పవన్ కల్యాణ్ బొట్టు పెట్టుకుని, చేతిలో మందు బాటిల్ పెట్టుకుని దీపావళి ముందుగానే వచ్చిందంటూ ఓ డైలాగ్ వేస్తారు. ఈ క్రమంలోనే బాంబు పేలుస్తారు. ఈ వీడియోతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.