Photo Story: సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన చాలా మంది పెరిగి పెద్దయ్యాక హీరో, హీరోయిన్లుగా ఎదిగిపోయారు. అయితే వీరిలో కొందరు సినిమాల్లో కొనసాగుతుండగా.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోయారు. అయితే ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు మాత్రం పోటీ పడి సినిమాల్లో కొనసాగుతున్నారు. అంతేకాకుండా వారు ఓ స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. ఇప్పుడు ఆ హీరోతో సమానంగా నటిస్తున్నారు. పై ఫొటోలోని ఇద్దరు చిన్నారులను చూసే ఉంటారు. వారిలో ఒకరు తేజా సజ్జ ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆయన పక్కన మరో చిన్నారి ఉంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత తండ్రి కృష్ణ తో సమానంగా స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వాళ్లు ఇప్పుడు మహేష్ బాబుకు పోటీ ఇస్తున్నారు. ఆయన సినిమాల్లో ‘యువరాజు’ గురించి ఒకప్పటి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. సిమ్రాన్, సాక్షి శివానంద్ తో కలిసి నటించిన ఈ మూవీ యావరేజ్ హిట్టు కొట్టింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా తేజా సజ్జా నటించారు. ఆయనతో పాటు ఓ చిన్నారి కనిపించింది.
ఈ చిన్నారి మరెవరో కాదు.. శ్రీదివ్య. ఈ పేరు చెప్పగానే ఇప్పుడు అందరూ గుర్తుపడుతారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి శ్రీ దివ్య ఆ తరువాత రవిబాబు ‘మనసారా’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తరువాత బస్ స్టాఫ్ సినిమాతో స్టార్ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళంలో బిజీ హీరోయిన్ గా మారింది. ఆమె తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ కావడంతో ఇక్కడ ఆదరించారు. ప్రస్తుతం శ్రీ దివ్య ‘రైడ్’ అనే సినిమా చేస్తోంది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది.
ఇక తేజా సజ్జ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో అద్భుతం సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆయన ‘హనుమాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఇందులో తేజా సజ్జా మాస్ లుక్ లో కనిపించి అందరికీ ఆకట్టుకుంటున్నాడు. ఒక రకంగా మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈయన ఇప్పుడు ఆయనకే పోటీ ఇచ్చేలా తయారయ్యాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.