Sankranthi Race: పొంగల్ ఫైట్ గురించి నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఐదు సినిమాలు పోటీపడుతున్నాయి. 2024 సంక్రాంతి పండక్కి పెద్ద హీరోల సినిమాలు క్యూ కట్టాయి. మహేష్ బాబు గుంటూరు కారం , తేజ సజ్జా హనుమాన్ , వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్ , నాగార్జున నా సామి రంగ , విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తున్నట్లు ప్రకటించారు. ఇవే కాక తమిళ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ ‘ లాల్ సలామ్ ‘, ధనుష్ ‘ కెప్టెన్ మిల్లర్ ‘ కూడా వస్తాయంటూ ప్రకటించారు.
ఇన్ని సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టం. దీంతో ఒకటి రెండు సినిమాలు వెనక్కి తగ్గితే బాగుంటుందని కొందరు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు తాజాగా ఈ పొంగల్ ఫైట్ గురించి మీడియా ముందు మాట్లాడారు. అందరకీ సంక్రాంతి రిలీజే కావాలి. ఆ పండక్కి ఏవో అద్భుతాలు జరుగుతాయి అని మా నమ్మకం. అయితే ఒకే సమయంలో అన్ని సినిమాలంటే థియేటర్స్ దొరకడం కష్టం.
అందుకే నేను నిర్మిస్తున్న ‘ ఫ్యామిలీ స్టార్ ‘ సినిమాని సమ్మర్ కి పోస్ట్ ఫోన్ చేశాను. ఇక మిగిలిన ఐదు సినిమాల్లో గుంటూరు కారం ముందుగా అనౌన్స్ చేశారు కాబట్టి పోస్ట్ ఫోన్ చేసే అవకాశం లేదు. మిగిలిన నాలుగు సినిమాల నిర్మాతలు ఆలోచించుకోవాలి. ఈ రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఆ నాలుగు సినిమాల నిర్మాతల్లో ఎవరైనా వచ్చి వెనక్కి వెళ్తామంటే .. వారికి సోలో డేట్ చూసి వారికి కావాల్సిన రిలీజ్ డేట్ ని కేటాయిస్తాము.
హనుమాన్ నిర్మాతలు కూడా నన్ను వచ్చి కలిశారు. ఎలా చేస్తే బాగుంటుందని సలహా అడిగారు. ఇక డబ్బింగ్ సినిమాల గురించి మాకు తెలియదు. మన సినిమాలకే ధియేటర్స్ లేవంటే వాళ్ళకి ఎక్కడ ఇస్తాము. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సినిమా పరిశ్రమ భేటీ గురించి దిల్ రాజు మాట్లాడారు. సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుని టాలీవుడ్ ప్రముఖులు సీఎం గారిని కలుస్తాము అంటూ చెప్పుకొచ్చారు.