అల వైకుంఠపురంలో విజయం తరవాత అల్లు అర్జున్ లో చాలా మార్పు వచ్చింది ఇక మీదట తాను చేసే చిత్రాలు పాన్ ఇండియా ప్లాట్ ఫార్మ్ కు తగ్గట్టుగా ఉండాలి అని నిర్ణయం తీసుకొన్నాడు. ఆ క్రమంలో నటులు మరియు సాంకేతిక నిపుణులు జాతీయ స్థాయికి తగ్గట్టు ఉండేలా చూసుకొంటున్నాడు.
దరిమిలా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ లో నటుల ఎంపిక కు ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నాడు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. కాగా ” పుష్ప” చిత్రం తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ,మల్లువుడ్ లలో అల్లు అర్జున్కి కావాల్సినంత క్రేజ్ ఉండటంతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బన్నీ పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నాడట. ప్రధాన పాత్రల్లో వీలైనంత మంది బాలీవుడ్ నటీనటులను నటింప చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు .
ఆ ఆలోచనలో భాగంగా ఈ ” పుష్ప” సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం వినయ విద్య రామ ఫేమ్ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కాగా.. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ యాక్టర్ను తీసుకోబోతున్నారట. ఆ క్రమం లో ఒకనాటి స్టార్ హీరోలైన సంజయ్ దత్, సునీల్ శెట్టి పేర్ తెర పైకి వచ్చాయి.ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శనమివ్వ నున్నాడు .. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్క నున్నఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్గా నటించనుంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bollywood actor play a key role in allu arjuns pushpa
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com