ఓటీటీలో ప్రస్తుతం బూతు కంపు కొడుతుంది. వెబ్ సిరీస్ లు రాకతో డిజిటల్ వేదిక వేడెక్కి.. ఆ బోల్డ్ నెస్ యవ్వారమే యువతరంలో యమా హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది. ఈ డిజిటల్ మాధ్యమంలో సెన్సార్ షిప్ అన్నది లేకపోవడంతో బూతు రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏం సినిమా తీస్తున్నామో, ఎలాంటి సినిమా తీస్తున్నామో.. అని కనీస అవగాహన కూడా లేకుండా.. బూతు రాయుళ్లు తమ బుర్రలకు పదును పెడుతూ.. బూతులో కూడా క్రియేటివిటీని చూపిస్తూ.. డీసెంట్ ప్రేక్షకులకు వెన్ సిరీస్ లు, వెన్ ఫిల్మ్ ల పైనే ఏవగింపు కలిగేలా చేసేస్తున్నారు. ఎక్కువుగా బెంగాలీ, హిందీ సినిమాల్లో కనిపించే అసహ్యమైన బూతు.. ఇప్పుడు తెలుగు డిజిటల్ కంటెంట్ లో కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతుందంటే దానికి ఎవర్ని నిధించగలం ?
అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!
రొమాన్స్ పేరుతో మితిమీరిన శృంగారంతో పాటు జుగుప్స కలిగించే క్రైమ్ స్టోరీల్ని.. రకరకాల వెబ్ సిరీస్ లలో చూపిస్తూ డబ్బులు చేసుకుంటున్న వారిని ఎలా ఆపేది. అదేమంటే నేటి సమాజంలో పెట్రేగుతున్న శృంగార కార్యకలాపాల ఆధారంగానే మేం తీస్తున్నాం అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ కథాంశం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిజానికి ఈ సినిమా నయం.. అంతకంటే దారుణమైన సినిమాలు చాల ఉన్నాయి. అంతెందుకు రామ్ గోపాల్ వర్మ బూతు సినిమాలు నగ్నం, క్లైమాక్స్ చూశాక.. ఆర్జీవీ అనేవాడు వింత జీవి అని మనం ఓ అభిప్రాయానికి రావొచ్చు.
ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్
ఇప్పటికైనా ఈ బూతు వ్యవహారం అనేది ఆగాలి అంటే.. డిజిటల్ మాధ్యమం పై ఆంక్షలు విధించాలి. బూతు విశృంఖలత్వాన్ని పెరగకుండా అడ్డుకట్ట వేయాలి. ఆధునిక యువత భావజాలం పక్కదారి పట్టకుండా మనమే కాపాడుకోవాలి. మొత్తానికి అడల్డ్ కంటెంట్ తో డిజిటల్ మాధ్యమం మీద ఎవ్వరూ దండయాత్రకు రాకుండా.. ఏ ఒక్క బూతు సినిమాను ఆదరించకుండా మనం ఉండాలి. అలాగే మూవీ మేకర్స్ కూడా ఆ దిశగా ఆలోచించాలి.