Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఓటింగ్ గ్రాఫ్ రోజు రోజుకి మారిపోతూ ఉంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి ఓటింగ్ భారీగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ, ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అవ్వడం విశేషం. అలాగే మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గౌతమ్ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూ వెళ్తుంది. ఇతను ఈ వారం మొత్తం టాస్కులు రఫ్ఫాడించేసాడు, సీజన్ 7 లో కసిగా ఆడే గౌతమ్ అంటే ఆడియన్స్ కి బాగా ఇష్టం, ఆ గౌతమ్ ఇప్పుడు మళ్ళీ ఈ వారం తిరిగి రావడంతో ఆయన ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ‘డ్రామా కంఠ’ గా పిలవబడే మణికంఠ గ్రాఫ్ ఈ వారం అమాంతం తగ్గిపోయింది అనే చెప్పాలి.
మొదటి 5 వారాలు సానుభూతి తో గేమ్ ని నెట్టుకుంటూ వచ్చిన ఈయన ముసుగు, నేటి ఎపిసోడ్ తో దాదాపుగా తొలిగిపోయింది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఈయనకి ఓటింగ్ టాప్ లో పడుతుంది అని చెప్పడంతో, ఈ వారం ఆట ని ఆడడం పూర్తిగా పక్కన పెట్టేసాడు. ఆట ఎలాగో ఆడడం లేదు కాబట్టి, ఓటింగ్ గ్రాఫ్ ఎక్కడ తగ్గిపోతుందో అనే భయం తో డ్రామా కంఠ పృథ్వీ తో కావాలని గెలుక్కొని మరీ గొడవ పెట్టుకున్నాడు. ఇది ఆయనకి ప్లస్ అవుతుందేమో, జనాలు గొర్రెలు లాగా ఓట్లు వేసేస్తారు అని డ్రామా కంఠ తప్పుగా అంచనా వేసాడు. చివరికి అది మిస్ ఫైర్ అయ్యి, బాటమ్ లో ఉన్నటువంటి పృథ్వీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. నిఖిల్ ఎలాగో ఓటింగ్ లో టాప్ లో ఉండడం తో ఆయన అభిమానులు కూడా పృథ్వీ కి ఓట్లు వేయడం వల్ల డ్రామా కంఠ ని ఓటింగ్ లో దాటేశాడు పృథ్వీ. దీంతో లేటెస్ట్ ఓటింగ్ లో ర్యాంకింగ్ ప్రకారం చూస్తే నిఖిల్ అందరికంటే టాప్ ఓటింగ్ తో మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు.
ఆ తర్వాతి స్థానం లో నబీల్ కొనసాగుతుండగా, మూడవ స్థానం లో గౌతమ్ కృష్ణ కొనసాగుతున్నాడు. ఇక నాల్గవ స్థానం లో ప్రేరణ కొనసాగుతుండగా, 5 వ స్థానం లో పృథ్వీ కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటి వరకు టాప్ 3 స్థానం లో కొనసాగిన మణికంఠ అలియాస్ డ్రామా కంఠ ఇప్పుడు ఆరవ స్థానంలోకి పడిపోయాడు. పాపం యష్మీ కి సంబంధించిన ఫుటేజీ ఈ వారం పెద్దగా రాకపోవడంతో ఆమె 7వ స్థానం కి పడిపోయింది కానీ, డేంజర్ జోన్ లో మాత్రం లేదు. ఇక చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజ, హరి తేజ కొనసాగుతున్నారు. హరితేజ ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. రేపు అర్థ రాత్రి వరకు ఓటింగ్ ఉండడం తో ఎదో ఒకటి జరగొచ్చు. ఈ రోజు టేస్టీ తేజ టాస్కులు అదరగొట్టేసాడు కాబట్టి, ఆయన గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 prithvi passed manikantha in voting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com