ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలంటే.. ముందుగా చెప్పుకునే సినిమాలు ‘ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్-2’ సినిమాలే. ముఖ్యంగా ‘బాహుబలి’ తరవాత గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి నుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వస్తుండటం, పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎలాగూ పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా కోసం సినీ ప్రముఖులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: చరణ్ తో మహేష్ డైరెక్టర్ ఫిక్స్.. కాకపోతే ?
అలాగే యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మరో సినిమా రాకింగ్ స్టార్ యశ్ – ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ చాప్టర్-2. చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి తెలిసిందే. అందుకే ఈ సినిమా సీక్వెల్ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు ‘కేజీఎఫ్’ టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ మార్కును దాటేసి మొత్తానికి సరికొత్త రికార్డ్స్ ను సృష్టించింది అంటేనే.. ఈ సినిమా రేంజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ చిత్రాలకు వివిధ భాషల్లో ఫుల్ క్రేజ్. నిజానికి ఈ రెండు సినిమాలూ గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాలి.
Also Read: చైతు కోసం పోటీలో పూజా – రష్మిక !
కానీ కరోనా అల్లకల్లోలంతో పాటు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి ఈ సినిమాలు. పైగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చిత్రీకరణ ఆలస్యం అయింది. దాంతో 2020 జులై 30 నుంచి 2021 జనవరి 8కి రిలీజ్ డేట్ ను మార్చగా.. కరోనా కారణంగా ఆ డేట్ ను కూడా అందుకోవడం సాధ్యం కాలేదు. ఇక ‘కేజీఎఫ్-2’ను గత ఏడాది దసరా కానుకగా అక్టోబరు 23న విడుదల చేయాలనుకున్నా… కరోనా కారణంగా అది క్యాన్సల్ అయింది. అయితే, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై చిత్ర బృందాలు ఒక అంచనాకు వచ్చాయట. ‘కేజీఎఫ్-2’ను సోలో రిలీజ్ గా జులై 30న ప్లాన్ చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ ను అక్టోబర్ లో విడుదల చేద్దామని అనుకుంటున్నారు. రెండు సినిమాలకి గ్యాప్ ఉండేలా మేకర్స్ ఒప్పందం చేసుకున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More