Homeఎడ్యుకేషన్నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. 1004 అప్రెంటీస్‌ ఉద్యోగాలు..?

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. 1004 అప్రెంటీస్‌ ఉద్యోగాలు..?


రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1,004 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసై ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీన ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 9 వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. 15 నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 12 నెలల పాటు శిక్షణా కాలం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.rrchubli.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు, హుబ్లీ, మైసూరులో సెంట్రల్ వర్క్‌షాప్, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్లలో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

https://jobs.rrchubli.in/actapprentice2020-21/ లింక్ ద్వారా డైరెక్ట్ గా లింక్ చేసుకోవచ్చు. మొత్తం 1,004 ఖాళీలు ఉండగా హుబ్లీ డివిజన్ ఉద్యోగాలు 287, బెంగళూరు డివిజన్ – 280, హుబ్లీ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ – 217 ఉద్యోగాలు, మైసూరు డివిజన్ – 177 ఉద్యోగాలు, మైసూరు సెంట్రల్ వర్క్‌షాప్ లో 43 ఉద్యోగాలు ఉన్నాయి. ఫిట్టర్, ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్), ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఎలక్టీషియన్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఉద్యోగాలు అప్రెంటీస్ ఉద్యోగాలు కాబట్టి వేతనం తక్కువగానే ఉంటుంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular