Homeక్రైమ్‌Madhya Pradesh: ప్రేమ పేరుతో పక్కింటి యువకుడి వేధింపులు.. చివరికి ఆ యువతి జీవితం ఏమైందంటే..

Madhya Pradesh: ప్రేమ పేరుతో పక్కింటి యువకుడి వేధింపులు.. చివరికి ఆ యువతి జీవితం ఏమైందంటే..

Madhya Pradesh: అది మధ్యప్రదేశ్ రాష్ట్రం. గుణ ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందిన ఆ యువతికి(20) చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మే అన్నీ అయి పెంచింది. ఈ క్రమంలో ఆ యువతిపై పొరుగింటి యువకుడు కన్నేసాడు. ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దానికి ఆ యువతి అభ్యంతరం చెప్పింది. ఆ విషయం తన తల్లితో చెప్పుకొని బాధపడింది. దీంతో ఆ యువతి తల్లి ఆ యువకుడిని నిలదీసింది. అప్పటినుంచి అతడు తన బుద్ధి మార్చుకున్నాడు. ఈలోగా ఆ యువతి తల్లి వేరే ఊరు వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ఆ యువతి ఇంట్లో దూరాడు. ఆమెను తన ఇంట్లో బంధించాడు..

ఇక అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఇలా నెలరోజులపాటు ఆమెపై పాడు పనికి పాల్పడ్డాడు. శారీరకంగా కొట్టాడు కూడా. ఆ గాయాలపై కారం పోసి.. తీవ్రంగా హింసించేవాడు.. తనను పెళ్లి చేసుకోవాలని, ఆస్తిని మొత్తం అప్పగించాలని వేధించాడు. దీంతో ఆ యువతి గత మంగళవారం రాత్రి అక్కడి నుంచి తప్పించుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తన నోటికి పాస్టర్లు అంటించి ఉండడం, కళ్ళు వాచిపోయి ఉండడం, ఒళ్లంతా గాయాలు.. కమలిన ఆనవాళ్లు ఉండడంతో పోలీసులు చలించిపోయారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె దగ్గర నుంచి వివరాలు సేకరించారు..”అతను మా ఎదురు ఇంట్లో ఉంటాడు. మొదటినుంచి నన్ను వేధిస్తున్నాడు. ప్రేమ పేరుతో ఇబ్బందులు పెడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని హింసకు గురి చేస్తున్నాడు. మొదట్లో మా అమ్మకు చెప్పాను. ఆమె అతడిని మందలించింది. అయినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు. మా అమ్మ ఊరికి వెళ్లగానే మా ఇంట్లోకి ప్రవేశించాడు. నన్ను అతడి ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.. చివరికి ఇలా తప్పించుకొని మీకు ఫిర్యాదు చేస్తున్నానని” ఆ బాధిత యువతి పోలీసుల ఎదుట వాపోయింది. కాగా, ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఆ యువకుడి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివారిని ఉపేక్షిస్తే సమాజంలో మరింతమంది అలానే తయారవుతారని చెబుతున్నారు. అందువల్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular