One Rupee Coin: మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు.. ఉదయం నుంచి రాత్రి వరకు..డబ్బు లేకుండా జీవితం గడువదు. ఒకప్పటికీ, ఇప్పటికీ డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు చేతిలో రూపాయి ఉంటే ఒక రోజు మొత్తం గడిచేది. కానీ ఇప్పుడు రూపాయి బిల్లలు కనిపించడం లేదు. ఎన్ని కోట్ల వ్యవహారాలైనా రూపాయి నుంచే మొదలవుతుంది. అందువల్ భారత దేశంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. రూపాయి మారకం తగ్గిపోకుండా ఆర్థిక నిపుణులు జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అయితే రూపాయి నోటు కాకుండా కాయిన్ ను ఎవరు.. ఎక్కడ తయారు చేశారో? దీనిని బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగంటే?
మనదేశంలో ఒక రూపాయి వంద పైసలతో సమానం. 1992 నుంచి దీనిని స్టీల్ తో తయారు చేస్తున్నారు. రూపాయి నాణెం బరువు 2.76 గ్రాములు ఉంటుంది. దేశంలో షేర్ షా సామ్రాజ్యంలో ముందుగా వెండి నాణెలను విడుదల చేశారు. ఆ తరువాత దానికి రూపియా అని పేరు పెట్టాడు. వీటిని మొఘల్, మరాఠా, ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు వాడారు. ఆ తరువాత రాగి తో రూపియాను ఏర్పాటు చేశారు. 1862లో కొత్త రూపాయి నాణెలు విడుదల చేశారు.
ఒకప్పుడు రూపాయి నాణెలను పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో మాత్రమే తయారు చేసేవారు. కానీ ఇప్పుడు ముంబై, నోయిడా, హైదరాబాద్ అనే నాలుగు ప్రదేశాల్లో తయారు చేస్తున్నారు. అయితే ఏ రూపాయి ఎక్కడ తయారు చేయబడిందో వారు కొన్ని క్లూస్ ఇస్తారు. ఆ మార్క్ ను బట్టి ఆ రూపాయి ఎక్కడ తయారు చేయబడిందో ఈజీగా తెలుసుకోవచ్చు.
ఒక రూపాయి పై సంవత్సరం కింద ఎలాంటి గుర్తు లేకపోతే అది కోల్ కతాలో తయారు చేయబడిందని అనుకోవాలి. దీనిపై సర్కిల్ లాగా ఉంటే దానిని నోయిడాలో తయారు చేశారని అర్థం. ఈ రూపాయి పై స్టార్ గుర్తు ఉంటే దానిని హైదరాబాద్ లో తయారు చేశారని అనుకోవాలి. డైమండ్ మార్క్ ఉంటే అది ముంబైలో తయారైందని అర్థం.