ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారం ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పెళ్ళిళ్లు, పండుగలు, ప్రత్యేక దినాలలో ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ధర పెరుగుతున్నా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. పేదవారి నుంచి ధనవంతుల వరకు తమ స్థోమతలను బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.
అయితే బంగారానికి గతేడాది భారీగా డిమాండ్ తగ్గిందని ఒక సర్వేలో వెల్లడైంది. గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు-2020 భారత్ లో గతేడాది సాధారణంగా ప్రతి సంవత్సరం జరిగే కొనుగోళ్లతో పోలిస్తే 35.34 శాతం పడిపోయిందని తెలుస్తోంది. గతేడాది కేవలం 446.4 టన్నుల గోల్డ్ విక్రయాలు మాత్రమే జరిగాయని సమాచారం. రోజురోజుకు పెరుగుతున్న ధరలు కూడా బంగారంపై డిమాండ్ తగ్గడానికి కారణమైందని తెలుస్తోంది.
కరోనా, లాక్ డౌన్ వల్లే బంగారానికి డిమాండ్ భారీగా తగ్గిందని తెలుస్తోంది. దేశీయ మార్కెట్ లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారానికి డిమాండ్ పడిపోవడం గమనార్హం. డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం 2020 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య బంగారం కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగిందని తేలింది. గతేడాది బంగారం కొనుగోళ్లు తగ్గినా ఈ ఏడాది కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2009 సంవత్సరంలో డిమాండ్ స్థాయిలో గతేడాది డిమాండ్ కనిపించినట్లు తెలుస్తోంది. కరోనా ఉధృతి తగ్గినా ప్రజల ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఏడాదైనా పరిస్థితులలో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది.