తెలుగుదేశం పార్టీకి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. గుంటూరులో టీడీపీ కార్యాలయం నిర్మాణంలో భూ కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపులో సీఆర్డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో మూడు వారాల్లోకి సమాధానం ఇవ్వాలని టీడీపీకి, ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు పంపింది.