ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతుండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. అయితే ఇటీవల టీడీపీ ప్రకటించిన కేంద్ర కమిటీల్లో తనకు చోటు కల్పించలేదనే తాను రాజీనామా చేసినట్లు చర్చించుకుంటున్నారు.