
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,82,286కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,108 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 3,262 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,71,916 మంది రికవరీ అయ్యారు. కొత్తగా గుంటూరు, కడప, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.