
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,030 పరీక్షలు నిర్వహించగా 1,869 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,87,051 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,582కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి.