
అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో దెబ్బతిన్న దేశాన్ని మళ్లీ నిలబెట్టడంలో భాగంగా తయారు చేసిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. 1.2 ట్రిలియన్ డాలర్ల ఈ బిల్లును సెనేట్ సభ్యులు 69-30 ఓట్ల తేడాతో గెలిపించారు. ఈ నిర్ణయం అమెరికాకు చాలా మేలు చేస్తుందని సెనేట్ లో మెజారిటీ పక్షనేత చక్ ఘామర్ అన్నారు. ఈ బిల్లుపై ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా సెనేట్ ఈ బిల్లును తన టేబుల్ మీదకు పంపాలని చెప్పారు. ఈ బిల్లుకు మిచ్ మెక్ కానెల్ సహా పలువురు రిపబ్లిక్ అభ్యర్థులు కూడా మద్దతిచ్చారు.