
కరోనా కారణంగా మార్చిలో వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వేతనాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను డిసెంబర్లో చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో తగ్గించిన వేతనాలను డిసెంబర్, 2021 జనవరిలో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.