ఏపీలో విగ్రహాలపై వరుసగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తాజాగా ఓ పార్కులోని బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని మంచినీటి పథకం పక్కనున్న పార్కులో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే నెలరోజుల కిందట కొందరు బుద్ధుడి విగ్రహం కుడి చేతి భాగాన్ని కొందరు ధ్వంసం చేశారు. శిల్పి సాయంతో కొత్త చేతిని అమర్చారు. అయితే ఆదివారం బుద్ధుడి మరో చేయిని విరగ్గొట్టారు. కాగా ఈ విగ్రహ ధ్వంసంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.