అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మండలం గోళ్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు, రెండు బైక్లు ఢీకొనడంతో ప్రమాదం సంభవించిందిన స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని స్థానికుల సహాయంతో వారు ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల్లో ఆర్టీసీ ఆసుపత్రి డాక్టర్ శివమాధవి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతొ ఈ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.