Homeఆంధ్రప్రదేశ్‌AP DGP: ఉదయం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ ఆఫీసులో ఉండండి.. 16మంది సీనియర్ ఐపీఎస్...

AP DGP: ఉదయం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ ఆఫీసులో ఉండండి.. 16మంది సీనియర్ ఐపీఎస్ లకు డీజీపీ మెమో

AP DGP: ఏపీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కార్‌ కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన గడిచిన ఐదేళ్లు తనను ఇబ్బంది పెట్టిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ను బదిలీ చేశారు. కొంత మందిని అప్రధాన్య పోస్టులు ఇవ్వగా, కొందరిని వెయిలింగ్‌ లిస్టులో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌కు సన్నిహితులు, అనుకూలులుగా ఉన్నారన్న కారణంతోనే చాలా మందిని పక్కన పెట్టారు. దీంతో 16 మంది ఐపీఎస్‌లు పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది ప్రభుత్వం ప్రసన్నం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో కీలక నేతలతో పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వీరికి డీజీపీ మొమోలు జారీచేసి షాక్‌ ఇచ్చారు. వెయిటింగ్‌ లిస్టులో ఉండి హెడ్‌ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండడం లేదన్న కారణంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ ఆఫీసులో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సాయంత్రం డ్యూటీ ముగిశాక అటెండెన్స్‌ రిజిస్ట్రీలో సంతకాలు చేయాలని స్పష్టం చేశారు.

వీరికి మెమోలు..
మెమో జారీ అయినవారిలో ఐపీఎస్‌ అధికారులు పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌కుమార్, సంజయ్, కాంతిరాణా టాటా, విజయరావు, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విశాల్‌గున్ని, రిషాంత్‌ రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, కృష్ణకాంత్‌ పటేల్, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, పాలరాజుకు మెమోలు ఇచ్చారు. మరోవైపు అనంతపురం జేసీగా డి.హరితకు ఇచ్చిన పోస్టింగును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రభుత్వం సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరితను ఆదేశించింది.
రవి కృష్ణకు పోస్టింగ్‌..
ఇదిలా ఉంటే.. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఆకే రవికృష్ణకు ఏపీ సర్కార్‌ పోస్టింగ్‌ ఇచ్చింది. పోలీస్‌ ఆర్గనైజేషన్‌ ఐజీగా ఆకే రవికృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌కు బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశాలిచ్చింది. మరోవైపు గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు వీలుగా ఏపీలో యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోంది. దీని బాధ్యతలను రవి కృష్ణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Oktelugu Epaper